‘అర్జున్ రెడ్డి’ ఈ సినిమా విడుదలై దాదాపు రెండేళ్లు పూర్తిచేసుకుంది .అయినా ఈ సినిమాపై వివాదాలు రావడం ఇంకా ఏ మాత్రం తగ్గలేదు . తెలుగులోనే కాకుండా ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోనూ తీశారు ,హిందీలో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించడంతో విమర్శకులు మండిపడిన విషయం తెలిసిందే. మలయాళ నటి పార్వతీ మీనన్ ఈ చిత్రాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. తానైతే ఒక నటిగా ఈ సినిమాల్లో నటించేదాన్నే కాదంటూ నిర్మొహమాటంగా చెప్పారు . ఈ సంగతి నేరుగా విజయ్ తోనే చెప్పిందంట ఈ గుమ్మా. ఆమె తాజాగా గోవా ఫిల్మ్ ఫెస్ట్వల్ వేదికలో విజయ్ దేవరకొండ ఎదురుగానే ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమాపై యూట్యూబ్లో వచ్చిన కామెంట్లు చూసి షాకయ్యాను. ‘ఒక సినిమా చూస్తే అది విషాదంగా ఉన్నా అక్కడే వదిలేస్తాం. అయితే అర్జున్రెడ్డి సినిమాలో హీరో మహిళను చెంపదెబ్బ కొడతాడు. ఈ సినిమాలో హింస ఎక్కువ వుంది అంతేయ్ కాదు ఈ సినిమా , యువతను ప్రేరేపించేదిగా ఉంది. పార్వతి దీనిపై మాట్లాడుతూ .... ఒక నటిగా ఈ సినిమాలో భాగం కాకుండా మాత్రమే ఉండగలను కానీ దర్శకుడిని సినిమా చేయవద్దని చెప్పలేను’ అని పేర్కొన్నారు. అయితే తనకు ఎదురొచ్చిన వాళ్లను చంపేసుకుంటూ పోయే జోకర్ సినిమా మాత్రం వాస్తవాలను చూపించిందనడం గమనార్హం.
సోషల్ మీడియాపై ఫైర్ అయ్యాడు రౌడీ. హీరో విజయ్ నటి పార్వతీ మీనన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఈ వార్తలు చూస్తుంటే చిరాకు పుడుతోంది. ప్రేమలో ఉన్నప్పుడు చిన్నపాటి ఘర్షణలు సహజం.. అది ప్రేమజంటకు అర్థమవుతుంది. అయినా దాన్ని ఎందుకు పెద్దదిగా చూస్తున్నారో అర్థం కావట్లేదు.
ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. పార్వతిని, ఆమె చేసే పనిని నేను ఇష్టపడతాను. ఆమె ప్రశ్నల వెనుక ఉన్న ఆంతర్యాన్ని నేను అర్థం చేసుకోగలను. కొన్నిసార్లు ఆమె మాటలతో ఏకీభవిస్తాను. కానీ సోషల్ మీడియా హడావుడే తనకు చికాకు కలిగిస్తోందన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావట్లేదు’ అంటూ వివరించాడు .