సూపర్ స్టార్ మహేష్ బాబు కి సెంటిమెంట్లు చాలా ఎక్కువ. గతంలో తన కెరియర్ లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’ సినిమా ఇండస్ట్రీ హిట్ అయిన సందర్భంలో తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘బిజినెస్ మాన్’ చేసిన సందర్భంలో ‘పోకిరి’ రిలీజ్ అయ్యాక అప్పట్లో పూరి జగన్నాథ్ సినిమాని వైజాగ్ లో చూడటం జరిగింది. దీంతో మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమా రిలీజయ్యాక పర్టిక్యులర్ గా డైరెక్టర్ పూరి సినిమాని వైజాగ్ లో మళ్లీ అదే థియేటర్ లో చూడాలని అప్పట్లో చెప్పడం మహేష్ సెంటిమెంట్ గా మారిందని అందుకే సినిమాని వైజాగ్ లో చూస్తున్న అంటూ డైరెక్టర్ పూరీ పేర్కొన్నారు.  ఇలానే చాలామందికి టాలీవుడ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వం లో 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే.

 

సంక్రాంతి పండుగకు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో మహేష్ బాబు అర్జెంట్ గా షిరిడి టూర్ కుటుంబ సమేతంగా వెళ్లడం వెనకాల అతి పెద్ద కారణం తాజాగా బయటపడింది. విషయంలోకి వెళితే మహేష్ భార్య నమ్రతా కి కూడా సెంటిమెంట్లు ఎక్కువ అని ఈ సందర్భంగా తేలింది.

 

భర్త మహేష్ నటించిన ఏ సినిమా అయినా ఇకనుంచి రిలీజ్ అవుతున్న తరుణంలో సినిమా రిలీజ్ కు ముందు షిరిడి వస్తానని సాయిబాబా కి నమ్రత మొక్కు కొన్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.  ఈ నేపథ్యంలో షిరిడి కి వెళ్ళిన ఫోటోలను కుటుంబ సమేతంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వరుసగా బాక్సాఫీసు దగ్గర రెండు హిట్లు పడటంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టాలని మరోపక్క అభిమానులు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: