ప్రస్తుతం బాలీవుడ్ ను ఏలేస్తున్న క్రేజీ భామ కియరా అద్వాని ఆమె కేవలం బీ టౌన్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా సత్తా చాటింది. సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటించి ఇక్కడ ప్రేక్షకులను మెప్పించిన కియరా ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. ఇక బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ తో అమ్మడు అక్కడ స్టార్ క్రేజ్ దక్కించుకుంది.

ప్రస్తుతం లక్ష్మీ బాంబ్ సినిమాలో కూడా నటించిన కియరా తన ఫస్ట్ లవ్ స్టోరీ గురిచి రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పింది. ఫస్ట్ లవ్ ఎప్పుడూ చాలా ప్రత్యేకమని అంటున్న కియరా ఇంటర్మీడియెట్ లోనే తను ఒకరిని ఇష్టపడ్డానని చెప్పింది. ఇంట్లో అబద్ధం చెప్పి అతనితో సినిమాలకు వెళ్ళే దాన్ని అని.. అయితే ఆ ఫెక్ట్ చదువుల మీద పడటంతో ఇవన్ని ఇప్పుడు అనవసరమని అనిపించి అతన్ని దూరం పెట్టానని అని చెప్పింది కియరా.

కియరా చెప్పిన ఆ ఇంటర్ లవ ఎవరో కాని అతను ఇప్పుడు వచ్చి ప్రపొజ్ చేస్తే ఆమె ఏమంటుందో చూడాలి. అప్పుడు కియరా ఓ కామన్ గర్ల్.. కాని ఇప్పుడు ఓ పెద్ద స్టార్ హీరోయిన్. మొదటి ప్రేమ కథలు చాలా ప్రత్యేకమని చెబుతున్న కియరా కొంపదీసి ఇప్పుడు ఎవరితోనైనా ప్రేమలో ఉందా అందుకే అమ్మడు ఇన్ డైరెక్ట్ హింట్ ఇస్తుందా అని గుసగుసలాడుతుంది ముంబై మీడియా.                                                        

మరింత సమాచారం తెలుసుకోండి: