కరోనా ప్రభావం సినిమాల మీద కూడా పడిందనే చెప్పాలి. కరోనా కారణంగా థియేటర్స్ అన్ని కూడా మూతపడ్డాయి. దీనితో చేసేది లేక చాలా సినిమాలు ఓటిటిలో విడుదల అవుతున్నాయి. చిన్న సినిమాలు చాలా వరకు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లోనే రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తుంది ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో అయిన ధనుష్ నటించిన జగమే తంత్రం సినిమా కూడా ఓటిటిలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది ఈ చిత్రాన్ని తెలుగులో "జగమే తంత్రం''అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. అలాగే ఇదే సినిమాను తమిళ భాషలో' జగమే తంతిరమ్’. అనే టైటిల్ తో ఓటిటీలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమాను ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'నెట్ ఫ్లిక్స్' లో జూన్ 18న డిజిటల్ పద్దతిలో రిలీజ్ చేయనున్నారు.


ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా 'జగమే తంత్రం' తమిళ ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సినిమా ధనుష్ కెరీర్‌లో 40వ చిత్రం అవ్వడం విశేషం. ఈ సినిమాలో అతడికి జోడిగా ఐశ్వర్య లక్ష్మీ  నటించింది. ఈ సినిమా ట్రైలర్ ధనుష్ ఒక గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తాడు. తమిళనాడుకు చెందిన 'సురులి' అనే ఒక గ్యాంగ్ స్టర్ గా సినిమాలో చూపించారు. లండన్ లో అక్రమ ఆయుధాలు, బంగారు నగల వ్యాపారాన్ని నియంత్రించడానికి అక్కడి పొలిటికల్ లీడర్ ఒకరు గ్యాంగ్ స్టార్ అయిన సురలిని నియమించుకుంటాడు.


సురలి విదేశాలకు వెళ్లి అక్కడి గ్యాంగ్ స్టార్స్ ని ఎలా ఎదుర్కొన్నాడో  అనేది ఈ సినిమాలో చూపించారు. ధనుష్ ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో జేమ్స్ కాస్మో, కలై యారసన్, జోజు జార్జ్ వంటి ప్రముఖులుఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.ట్రైలర్ చూస్తుంటే సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని అర్ధం అవుతుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ధనుష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: