సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కొంతమంది హీరోయిన్లు కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితం అవుతుంటారు. కానీ కొంతమంది చేసిన కొన్ని సినిమాలతోనే ప్రేక్షకుల హృదయాల్లోస్థానం సంపాదించుకుంటూ ఉంటారు.  అలా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో రోజుల నుంచి తనదైన శైలిలో అలరిస్తూ దూసుకుపోతుంది ప్రియమణి.  అయితే చాలా మంది హీరోయిన్లకు కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.  అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మంచి నటిగా కొనసాగుతున్న ప్రియమణికి కూడా ఒకప్పుడు ఇలాంటి తరహా ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది.



 ఇటీవలే ప్రియమణి కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది.  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగ అనే సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ తో జతకట్టి తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది ప్రియమణి ఇక ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించేది.  కానీ ఆ తర్వాత ఏమైందో సరైన అవకాశాలు అందుకోలేక చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించలేక తెలుగు తెరపై కనుమరుగైపోయింది.  ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిలైంది.



 ఇక ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తోంది . ఇకపోతే ఇటీవల కెరీర్ తొలినాళ్లలో ఎదురైనా చేదు అనుభవాలను సోషల్ మీడియా వేదికగా తెలిపింది. తన బాడీ షేమింగ్ చేస్తూ చిత్ర పరిశ్రమలో చాలామంది అసభ్యకరంగా మాట్లాడేవారు అంటూ చెప్పుకొచ్చింది. ఆంటీ లాగే ఉన్నావు అంటూ కామెంట్ చేసి తనను ఎంతగానో బాధ పెట్టే వారిని..  అంతే కాకుండా ఎంతో మంది నల్లగా ఉన్నావ్ అంటూ తన కలర్ గురించి కూడా దారుణంగా కామెంట్ చేసే వారు అంటూ తెలిపింది ప్రియమణి. కానీ నిరాశ చెందకుండా తనపై తాను నమ్మకం ఉంచి ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతున్న అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి.

మరింత సమాచారం తెలుసుకోండి: