టాలెంట్ ఉంటే చాలు ఎవరైనా హీరోగా నిలదొక్కుకోవచ్చు అని చెప్పేందుకు ఉదాహారణలుగా టాలీవుడ్‌లో పలువురు హీరోలు ఉన్నారు. ఈ కోవకు చెందిన వాడే సత్యదేవ్. నటుడిగా తనకంటూ స్పెషల్ రికగ్నిషన్ తెచ్చుకున్న సత్యదేవ్ ప్రజెంట్ ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. తన కెరీర్ స్టార్టింగ్‌లో సపోర్టింగ్ రోల్స్ ప్లే చేసిన సత్యదేవ్ ప్రస్తుతం లీడ్ క్లారెక్టర్స్ ప్లే చేస్తున్నాడు. కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో హీరోలందూ ఖాళీగా ఉండగా, సత్యదేవ్ మాత్రం వరుసగా తన సినిమాలను ఓటీటీ వేదికగా విడుదల చేశాడు. వాటితో తనకు మంచి గుర్తింపు కూడా లభించింది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘జ్యోతి లక్ష్మి’ చిత్రంతో సత్యదేవ్‌కు మంచి గుర్తింపు లభించింది. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేశ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘వేదాళం’ రీమేక్‌లో సత్యదేవ్ కీ రోల్ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా సత్యదేవ్ లీడ్ రోల్ ప్లే చేసిన ‘లాక్డ్’ సిరీస్‘ఆహా’లో స్ట్రీమ్ అవుతుంది. దీనికి సీక్వెల్ కూడా రెడీ అవుతున్నది. ఈ విషయమై ‘ఆహా’ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది.

సినిమాల విషయానికొస్తే..సత్యదేవ్ హీరోగా నటించిన ‘తిమ్మరుసు’ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. దీంతో పాటు ఫేమ్ గోపిగణేశ్ పట్టాభి డైరెక్షన్‌లో వస్తున్న ‘గాడ్సే’ అనే చిత్రంలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా‌తో కలసి ‘గుర్తుందా శీతాకాలం’ అనే చిత్రంలో నటిస్తున్నాడు సత్యదేవ్. ఇందులో ఓ కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ సుహాసిని కనిపించబోతుంది. వి.వి.గోపాలకృష్ణ అనే కొత్త దర్శకుడి డైరెక్షన్‌లో ‘భగవద్గీత సాక్షిగా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సత్యదేవ్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. ఖిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘రామ్ సేతు’లో కీ రోల్ ప్లే చేయనున్నాడని సమాచారం. మొత్తంగా సత్యదేవ్ వెరీ ప్యాషనేట్‌గా సినిమాలు, సిరీస్ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: