పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం ఎక్కడ చూసిన అల్లు అర్జున్ హవానే కనిపిస్తుంది. సౌత్‌, నార్త్‌ అని తేడాలేకుండా ప్రతి చోట అల్లుఅర్జున్‌ పేరు మార్మోగిపోతుంది.
అవార్డు ఫంక్షన్‌ ఏదైనా సరే అందులో బన్నీ పేరు కచ్చితంగా వినబడుతుంది. కాగా గతేడాది వచ్చిన పుష్ప సినిమాతో అల్లుఅర్జున్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
ప్రస్తుతం ఎక్కడ చూసిన అల్లు అర్జున్ హవానే కనిపిస్తుంది. సౌత్‌, నార్త్‌ అని తేడాలేకుండా ప్రతి చోట అల్లుఅర్జున్‌ పేరు మార్మోగిపోతుంది. అవార్డు ఫంక్షన్‌ ఏదైనా సరే అందులో బన్నీ పేరు కచ్చితంగా వినబడుతుంది. కాగా గతేడాది వచ్చిన పుష్ప సినిమాతో అల్లుఅర్జున్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా దక్షిణాదిన బన్నీకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. పుష్ప రాజ్‌గా బన్నీ నటనకు ప్రేక్షకులు థియేటర్‌లకు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమాలో అల్లుఅర్జున్ నటనకు ఇప్పటికే ఫిలింఫేర్‌, సైమా అవార్డులు రాగా.. ఇప్పుడు బన్నీ మరో అత్యున్నత అవార్డును అందుకున్నాడు.

తాజాగా అల్లుఅర్జున్‌ ఎంటర్‌టైన్‌ కేటగిరిలో ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డును మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేతులు మీదుగా అల్లుఅర్జున్ ఈ అవార్డును అందుకున్నాడు. కాగా ఈ కేటగిరిలో అల్లుఅర్జున్‌తో పాటు రాజమౌళి(ఆర్‌ఆర్‌ఆర్‌), వివేక్‌ అగ్నిహోత్రి(ది కాశ్మీర్‌ ఫైల్స్‌), ఆలియాభట్‌(గంగూబాయ్‌ కతియావాడి), కార్తిక్‌ ఆర్యన్‌(భూల్‌ భూలైయా-2)లు నామినేట్ అయ్యారు. కాగా జ్యూరి ఈ అవార్డుకు అల్లు అర్జున్‌ను ఎంపిక చేశారు. అల్లుఅర్జున్‌ ఈ అవార్డు గెలిచిన మొదటి సౌత్‌ హీరోగా రికార్డు సృష్టించాడు.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప చిత్రానికి క్రియేటీవ్‌ జీనియస్‌ సుకుమార్‌ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. ముఖ్యంగా హిందీలో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో బన్నీకు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ప్రస్తుతం సినీ ప్రేక్షకులు పుష్ప-2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: