శర్వానంద్ కొంత కాలంగా వరుస అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్నాడు. అలాంటి సమయం లోనే ఈ నటుడు ఒకే ఒక జీవితం అనే సినిమాలో హీరో గా నటించి మంచి విజయాన్ని అందుకొని ఫుల్ కం బ్యాక్ అయ్యాడు . ఇక పోతే ప్రస్తుతం ఈయన వరుస సినిమాల్లో హీరో గా నటిస్తూ ఫుల్ జోష్ ను చూపిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం శ్రీ విష్ణు హీరో గా రెబా మౌనిక జాన్ హీరోయిన్ లుగా సామాజవరగమన అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు.

మూవీ మంచి విజయం సాధించడంతో ఈ దర్శకుడి కి అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో దక్కింది. ఇకపోతే సమజవరకమన సినిమా తర్వాత నెక్స్ట్ మూవీ కి కాస్త ఎక్కువ సమయం తీసుకున్న ఈయన తాజాగా శర్వానంద్ పుట్టిన రోజు సందర్భం గా ఆయనతో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో శర్వానంద్ కి జోడిగా ఇద్దరు హీరోయిన్ లు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ బృందం సంయుక్త మీనన్ , సాక్షి వైద్య లను ఈ మూవీ లో శర్వానంద్ కు జోడి గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సంయుక్తా మీనన్ ఇప్పటికే తెలుగు లో నటించిన డెవిల్ మూవీ తో తప్ప అన్ని సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. ఇకపోతే సాక్షి వైద్య కు ఇప్పటి వరకు ఒక విజయం కూడా దక్కకపోయినప్పటికీ వరుస సినిమా అవకాశాలు మాత్రం ఈ నటికి దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: