ఇది సినిమా పరిశ్రమ ఎవరు ఉనికి వారు కాపాడుకోవడం కోసం దర్శకులు ఇప్పటికప్పుడు కొత్త గా మారుతూనే ఉంటారు . కావాలంటే మీరే చూడండి .. అంటే సుందరానికి , బ్రోచేవారెవరురా లాంటి క్లాస్సిక్ సినిమాలు తీసిన వివేకాత్రేయ ఒక్క అపజయానికే తన‌ను తాను మార్చుకొని సరిపోదా శనివారం అంటూ మాస్ సినిమాతో హిట్‌ అందుకున్నాడు. అలాగే విలక్షణ దర్శకుడు  శేఖర్ కమ్ముల కూడా ఎప్పుడు ఊహించని దారిలో కుబేర సినిమాతో వస్తున్నాడు .. ఇప్పటికే కుబేర టీజర్స్ , కంటెంట్ చూస్తుంటే అసలు ఇది శేఖర్ కమ్ముల సినిమా నేనా అని అనుమానం అందరికీ వస్తుంది .. ఎందుకంటే  శేఖర్ కమ్ముల సినిమా అంటే సపరేట్ మార్క్ అందులో కనిపిస్తుంది ..


ఇక వాటన్నిటిని దాటి తన్ను తాను కొత్త గా చూపించుకోవడానికి ఈ సినిమా ట్రై చేస్తున్నాడు ఈ సీనియర్ దర్శకుడు . మాట్లాడితే వింతగా అనిపిస్తుంది కానీ .. స్టార్ ద‌ర్శ‌కుడు కొరటాల శివ కూడా దేవరతో ఇలాంటి ఓ ప్రయత్నమే చేశారు .. ఆచార్య తర్వాత తన మేకింగ్ పరంగా అప్డేట్ అయ్యారు కొరటాల .. ఎన్టీఆర్ తో చేసిన దేవర సినిమాలో ఇది కనిపించింది . ఇక కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిన చందూ మొండేటి  .. తండేల్ తో తొలిసారి భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు .. ఈ సినిమా అవుట్ ఫుట్ పై చిత్ర యూనిట్‌ ఎంతో నమ్మకంగా ఉంది ..


2025 ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకు ముందుకు రానుంది. విజయాల కోసం కొత్త ఇమేజ్ వైపు పరుగు తీస్తున్న దర్శకులు కొందరైతే .. కొత్త ప్రపంచాలు క్రియేట్ చేస్తూ విజయాలు అందుకుంటున్న వారిలో ప్రశాంత్ వర్మ ఒకరు .. హనుమాన్ తో యూనివర్స్ ను ఓపెన్ చేసిన ప్రశాంత్ వర్మ .. అదిరా , జై హనుమాన్ , మహాకాళి సినిమాలని ఇదే ప్రపంచంలో తీసుకురాబోతున్నాడు .. మొత్తానికి ఎలా చేసినా విజయం ముఖ్యం అంటూ మన దర్శకుల ఆలోచన ముందుకు వెళుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: