ప్రభాస్ మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాళవిక మోహనన్ ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ హీరోయిన్ తాజాగా నటులలో మేకవన్నె పులులున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఆడ, మగ అనే తారతమ్యం ఉండకూడదని ఆమె తెలిపారు.

అయితే సినిమా ఇండస్ట్రీలో అది చాలా ఉందని  వెల్లడించారు. నటులకు దొరికే మర్యాద  నటీమణులకు ఇక్కడ ఇవ్వరని అన్నారు.  రెమ్యునరేషన్ విషయంలో సైతం సమానత్వం లేదని  ఆమె అన్నారు.  హీరోలకు  అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నారని  హీరోయిన్లకు  మాతం తగ్గించి ఇస్తున్నారని ఈ పరిస్థితి మారాలని  ఈ పక్షపాత ధోరణి మారాలని ఆమె అన్నారు.

ఇకపోతే సినిమాలో కొందరు నటులు  ఉన్నారని  వారు  మహిళల మధ్య  మంచివారిగా కనిపించే ప్రయత్నం  చేస్తారని తెలిపారు.  అలాంటి మేకవన్నె పులులు  సమయం వచ్చినప్పుడు  వారి అసలు రంగును  బయట పెడతారని వెల్లడించారు.  అలా గత ఐదేళ్లుగా  ముఖానికి అందమైన మాస్క్  వేసుకున్న పలువురు నటులను  తానూ చూశానని చెప్పుకొచ్చారు.  వాళ్లంతా బుద్ధిమంతులు అని భావించరాదని ఆమె అన్నారు.

ఏ సమయాలలో నటీమణులతో మంచిగా ఉండాలో వారికి తెలుసని మాళవిక చెప్పుకొచ్చారు.  కానీ కెమెరా వెనుక వారు ఎలా మారతారనేది తాను  కళ్లారా చూశానని మాళవిక మోహన్ చెప్పుకొచ్చారు.  అయితే మాళవిక మోహనన్  కు ఎదురైన చేదు అనుభవాలు ఏంటి? ఆమె ఎందుకు ఇలా మాట్లాడారు? అనే ప్రశ్నలకు మాత్రం జవాబులు దొరకాల్సి ఉంది.  



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: