టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్ రాబోతుంది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్ డమ్’ మీద ఇప్పటికే భారీ హైప్ నెలకొని ఉంది. ఇప్పుడు ఆ అంచనాలకు మరింత బలాన్ని చేకూర్చేలా ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది. జూలై 26న సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ఈ అప్‌డేట్‌తో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ స్పీడ్ మీద వెళ్లిపోతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, విజయ్ కెరీర్‌లో మరో టర్నింగ్ పాయింట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. గతంలో జెర్సీ వంటి హార్ట్‌టచింగ్ సినిమాను తెరకెక్కించిన గౌతమ్, ఈసారి విజయ్ కోసం ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశారని ఫిల్మ్ సర్కిల్స్ లో బజ్.


ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా, టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేశారు. కింగ్ డమ్ ట్రైలర్‌కు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే సినిమా యాక్షన్, ఎమోషన్, క్లాస్ & మాస్ అంశాల మిశ్రమంగా ఉంటుందని అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌తో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ మీద హైప్ మరింత పెరిగిపోయింది. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మార్కెట్‌ను ఎప్పుడో టార్గెట్ చేస్తున్నాడు.


లైగర్ సినిమాతో అనుకున్న ఫలితం రాకపోయినా, ‘కింగ్ డమ్’ మాత్రం ఆయనకి నెక్స్ట్ బిగ్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాను జూలై 31న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. విజయ్ మార్క్ డైలాగులు, గౌతమ్ న్యారేషన్, అనిరుధ్ మ్యూజిక్ అన్నీ కలిస్తే ఈ సినిమా టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో కూడా ఫైర్ పెట్టడం ఖాయం అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. మరి ట్రైలర్‌తో ఎంతవరకు మాస్‌ను ఆకట్టుకుంటారో చూడాలి. రౌడీ హీరో ‘కింగ్’గా ఎలా అదరగొడతాడో ఈ జూలై 26న క్లారిటీ వచ్చేస్తుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: