సోషల్ మీడియాలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ని ఏ రేంజ్‌లో ఆడుకుంటున్నారో అందరికీ తెలిసిందే. దానికి కారణం ఆయన నటించిన వార్ 2 సినిమా మిక్స్‌డ్ టాక్ సంపాదించుకోవడమే. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ లేటెస్ట్ బిగ్ ప్రాజెక్ట్ ఆగస్టు 14న విడుదలైంది. అయితే ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాకు ప్రేక్షకులు పూర్తి మార్కులు వేయలేకపోయారు.ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్‌ని కావాలనే కొంతమంది టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగినప్పుడు ఎన్టీఆర్ ఓ రేంజ్‌లో స్పీచ్ ఇచ్చారు. “మా నాన్న, మా తాత ఆశీర్వాదాలు ఉన్నంతవరకు నన్ను ఎవరు ఏమి చేయలేరు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, “రెండు కాలర్లు ఎత్తి సినిమా చూశాక అభిమానులు కూడా ఇలా కాలర్ ఎగరేస్తారు” అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడారు.


కానీ సినిమా రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయింది. సొంత ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకు సంబంధించి పాజిటివ్ రివ్యూలు ఇవ్వలేకపోయారు. దీంతో ఆయన కాలర్ ఎగరేసిన సినిమా ఫ్లాప్ అయింది. ఇదే కాదు, గతంలో కూడా ఇలాంటిదే జరిగింది. అర్జున్ – సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఈవెంట్‌లో కూడా ఎన్టీఆర్ “నేను సినిమా చూశాను, మీరందరూ కూడా కాలర్ ఎగరేసుకునేలా ఉంటుంది” అంటూ కామెంట్ చేశారు. కానీ ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు అందరి కళ్లు దేవర 2 ప్రాజెక్ట్‌పై ఉన్నాయి.

 

దేవర 2 సినిమా కూడా సక్సెస్ కాకపోతే, జూనియర్ ఎన్టీఆర్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్  సినిమా పనులు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా హిట్ అవ్వాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తాడో..?? మొత్తానికి తారక్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి బిగ్ తప్పు చేశాడు అన్న కామెంట్స్ నే ఎక్కువ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: