అల్లుఅర్జున్ రామ్ చరణ్ ల మధ్య ప్రస్తుతం బయట పడేంత వార్ లేకపోయినా కెరియర్ పరంగా బన్నీ చరణ్ కన్నా చాల స్పీడ్ గా ఉండటంతో వీరిద్దరి మధ్యా కనిపించని సైలెంట్ వార్ నడుస్తోంది అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో వీరిద్దరి మధ్య కొనసాగుతున్న సైలెంట్ వార్ కు సుకుమార్ కేంద్ర బిందువు కాబోతున్నాడు అన్న గాసిప్పులు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి.

సుకుమార్ దర్శకత్వం వహించిన ‘నాన్నకు ప్రేమతో’ ఈ సినిమా బయ్యర్లకు పెద్దగా కలిసిరాకపోయినా దర్శకుడుగా సుకుమార్ కు చాల మంచి పేరును తెచ్చి పెట్టింది. దీనితో సుకుమార్ చేయబోయే తదుపరి సినిమాల పై ఆ శక్తి పెరిగింది. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న లేటెస్ట్ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న నేపధ్యంలో ఈసినిమా తరువాత సుకుమార్ చేయబోయే సినిమాకు సంబంధించి తీవ్ర పోటీ అల్లుఅర్జున్ రామ్ చరణ్ ల మధ్య ఏర్పడింది అని ఫిలింనగర్ టాక్.

వినపడుతున్న వార్తల ప్రకారం సుకుమార్ తో సినిమా చేయడానికి బన్నీ చెర్రీలు ఇద్దరు ఇష్టపడుతున్న నేపధ్యంలో ముందుగా ఈ ఇద్దరి హీరోలలో ఎవరితో సినిమాను చేయాలి అన్న సందిగ్ధంలో సుకుమార్ ఉన్నట్లు టాక్. అంతేకాదు ఇప్పటికే సుకుమార్ అల్లుఅర్జున్ తో ‘ఆర్యా’, ‘ఆర్యా 2’ చేసిన నేపధ్యంలో బన్నీతో కాకుండా ఈసారి చరణ్ తో చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన సుకుమార్ కు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనికితోడు ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన మైత్రీ మూవీస్ రామ్ చరణ్ తో ఒక సినిమాను చేయాలని ఇప్పటికే నిశ్చయించుకోవడంతో ఆ మూవీ ప్రాజెక్ట్ కు సుకుమార్ దర్శకుడిగా ఉంటే బాగుంటుంది అని ఆ నిర్మాణ సంస్థ సుకుమార్ పై ఒత్తిడి పెంచినట్లు టాక్. అయితే సుకుమార్ మాత్రం ప్రస్తుతానికి తన మనసులో మాట బయట పెట్టకుండా చరణ్ బన్నీల కోసం ఇద్దరికీ సరిపడే కథల గురించి ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: