తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎన్నో చిత్రాలు నిర్మించిన దిల్ రాజు గత సంవత్సరం అపజయాలతో సతమతమయ్యారు.  ఈ సంవత్సరం ప్రారంభంలో అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 2 చిత్రం మంచి సక్సెస్ తో భారీ కలెక్షన్ల వసూళ్లు దిశగా సాగుతుంది.  ప్రస్తుతం అశ్వినీదత్, దిల్ రాజు, పీవీపీలు సంయుక్తంగా వంశి పైడి పల్లి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు, పూజా హేగ్డె ముఖ్యపాత్రలో ‘మహర్షి’చిత్రం నిర్మిస్తున్నారు.   
Image result for maharshi movie
ఈ చిత్రం షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు.  ఈ చిత్రం షూటింగ్ షర వేగంగా జరుగుతుంది. అయితే ‘మహర్షి’చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నట్లు ఆ మద్య చిత్ర యూనిట్ వెల్లడించింది.  అయితే ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. 
Image result for maharshi movie
ఈ రూమర్లపై స్పందించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘మహర్షి’చిత్రం ఏప్రిల్ 25 న రిలీజ్ చేయబోతున్నామని..ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ రూమర్లు..అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: