ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వైరస్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడంతో చాలామందికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. హాస్పిటల్ కి వెళ్లి అటువంటి వ్యక్తులకు చికిత్స ఇప్పిస్తే (అవసరాన్ని బట్టి ఆక్సిజన్ సిలిండర్ తో ఆక్సిజన్ ఇప్పించడం వంటివి) చాలామంది ప్రమాదం నుండి బయట పడి కోలుకుంటున్నారు. కానీ సామాన్యులకు ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ పేషెంట్లకు ట్రీట్మెంట్ కి చెబుతున్న ఫీజులు కట్టడం గగనంగా మారుతోంది. మరి కొందరికి ఆర్థికంగా స్తోమత ఉన్న వారికి బెడ్స్ దొరకకపోవడం, ఆక్సిజన్ సిలిండర్ల కొరత వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో అద్భుతమైన ఈ వార్త అందరికీ ఉపయోగ పడుతుందనే అంటున్నారు.

శ్రీ ప్రమోద్ మల్కన్  అనే వ్యక్తి యొక్క కుటుంబంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఇది. ప్రమోద్ కోడలు కరోనా బారిన పడి ఆమె ఆక్సిజన్ లెవెల్స్ 80 నుంచి 85 కు పడిపోయింది. ఆమెను వెంటనే హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందించాలని వైద్యులు తెలిపారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో హాస్పిటల్స్ లో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూసి... వారు ఇంట్లోనే కొన్ని పదార్థాలను ఉపయోగించి ఔషధాన్ని తయారు చేశారు.. దాంతో 24 గంటల్లోనే ఆమె ఆక్సిజన్ లెవెల్స్ 98 కి చేరుకున్నాయి. అది ఎలా చేశారు అంటే... వాము మరియు కర్పూరం... ఇవి రెండింటినీ ఒక తెల్లటి గుడ్డలో తీసుకొని బాగా దంచి, ముక్కు దగ్గర వాసన చూపించి... ఆ వాసనను పది పదిహేను సార్లు గట్టిగా శ్వాసను తీసుకోమన్నారు.

ఇలా ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆ ఔషధంతో శ్వాస తీసుకునేలా చేశారు. దాంతో 24 గంటలలోనే ఆమెకు ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి శ్వాస తీసుకోవడం సులువయింది. కాబట్టి ఈ విషయాన్ని ఆయన అందరికీ తెలియజేశారు. తన స్నేహితుడు కూడా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిన సమయంలో... ఇదే చిట్కాను వాడి కోలుకున్నట్టు వివరించాడు. కాబట్టి ఎవరైతే హాస్పిటల్ కి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారో ఇలా ఒకసారి చేసి చూడండి. అలాగే వైద్య సహాయం కూడా తీసుకోవడం మంచిది. ఇది కేవలం ఒక సలహా మాత్రమే...పూర్తిగా డాక్టర్ సలహా తీసుకున్న తరువాతనే ప్రయత్నించగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: