సభ సజావుగా సాగేందుకు వీలుగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను స్పీకర్ ఆదేశించారు.
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, శాసనమండలి కార్యదర్శి వీ నరసింహాచార్యులు, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
శాసనసభ ఎనిమిదవ సెషన్లో మొదటి సమావేశం 2021 అక్టోబర్ 8న ముగిసింది. అయితే, వాయిదా పడిన సెషన్ను గవర్నర్ ప్రోరోగ్ చేయనందున, రాబోయే బడ్జెట్ సెషన్ను రెండవ సమావేశంగా పరిగణిస్తారు. ఎనిమిదో సెషన్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభం అవుతుంది. రాష్ట్ర శాసనసభ ఉమ్మడి సమావేశాలు కూడా ఉండవు. ప్రభుత్వ వర్గాల ప్రకారం, “సెషన్ను ప్రోరోగ్ చేయకపోతే, ఉమ్మడి సెషన్లో గవర్నర్ ప్రసంగించాల్సిన అవసరం లేదు.