సొంతింటి కల ప్రతి ఒక్కరికి ఉంటుంది.. అయితే చేతిలో సమయానికి డబ్బులు లేక ఆ ఆలోచనను కొందరు మాను కుంటారు.. మరి కొంతమంది లోన్ తీసుకొని మరి ఇల్లు కట్టుకుంటారు..కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే లోన్స్ ఇస్తుంది.ఆ బ్యాంకుల లిస్ట్ ను ఒకసారి ఇప్పుడు చుద్దాము..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అతి తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణాన్ని అందిస్తోంది. అంటే, మీరు ఈ బ్యాంకుల నుండి చౌకైన గృహ రుణాన్ని పొందవచ్చు.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోర్ ఆధారంగా వివిధ గృహ రుణ వడ్డీ రేట్లను అందిస్తుంది. గృహ రుణ వడ్డీ రేట్లు 8.4 శాతం నుంచి ప్రారంభమై 9.05 శాతానికి చేరుకుంటాయి..

ఐసీఐసీఐ బ్యాంక్ దరఖాస్తుదారు క్రెడిట్ స్కోర్ ఆధారంగా వివిధ వడ్డీ రేట్లను కూడా అందిస్తుంది. ప్రాథమిక గృహ రుణ వడ్డీ రేటు 8.4 శాతం. రుణగ్రహీత ప్రొఫైల్‌ను బట్టి ఇది 9.5 శాతానికి చేరుకుంటుంది..ఎస్బీఐ,ఇది సేమ్ రేటును కలిగి వుంది.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హోమ్ లోన్ రేట్లు మహిళలకు 8.6 శాతం,ఇతరులకు 8.65 శాతం నుండి ప్రారంభమవుతాయి. 30 లక్షల వరకు రుణాలపై వడ్డీ రేటు 9.1 శాతం వరకు ఉంటుంది. రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల మధ్య గృహ రుణాలపై వడ్డీ రేటు 8.85 శాతం నుంచి 9.40 శాతం వరకు ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ బ్యాంక్) క్రెడిట్ స్కోర్, ప్రొఫైల్, హోమ్ లోన్ రకాన్ని బట్టి 8.20 శాతం నుండి 9.35 శాతం మధ్య వివిధ వడ్డీ రేట్లను అందిస్తుంది. 30 లక్షల వరకు రుణాలపై వడ్డీ రేటు 8.2 శాతం. ఇందులో ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌, బీఎస్‌పీ కలిపితే 8.65 శాతం అవుతుంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ హోమ్ లోన్ రుణాన్ని తిరిగి చెల్లించడానికి 30 సంవత్సరాల కాల వ్యవధిని అందిస్తుంది. ఇందులో, మీరు గృహ రుణంపై ప్రతి సంవత్సరం 8.30 శాతం వడ్డీ రేటును చెల్లించాలి..అదే విధంగా..

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక సంవత్సర కాలానికి ఎంసీఎల్ఆర్‌ను 7.80 శాతం నుండి 7.90 శాతానికి పెంచింది. వాహన, వ్యక్తిగత, గృహ రుణాల వంటి కస్టమర్ రుణాలపై అదే వడ్డీ విధించబడుతుంది. ఎంసీఎల్ఆర్‌ నవంబర్ 7, 2022 నుండి అమలులోకి వచ్చింది. అదే సమయంలో, ఒక నెల కాలపరిమితి ఎంసీఎల్ఆర్‌ 0.05 పాయింట్లు పెరిగి 7.50 శాతానికి చేరుకుంది. 1 రోజు, 3 , 6 నెలల కాలవ్యవధి కలిగిన రుణాల వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు..

ఇది ఇలా ఉండగా.. ఆర్బీఐ ఈ మధ్య రేపో రేటును భారీగా పెంచింది..ప్రస్తుత రేట్లు 5.9 శాతం. ఆర్‌బీఐ రెపో రేటు పెంచిన తర్వాత వడ్డీ రేట్లను పెంచింది. దీని తర్వాత లోన్, ఈఎంఐ ఖరీదైనవిగా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: