దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే..ఇప్పటికే పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి.కొన్ని గ్రామాల మధ్య రాక పొకలు నిలిచిపొయాయి..తెలంగాణను వర్షం వీడేలా లేదు..వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.. తెలంగాణ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్‌ చేసింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్టోబర్ 4వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.



ఏపీ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.అలాగే ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన మరో ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతవారణ శాఖ వివరించింది. ఈ కారణంగా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంట్లో తెలంగాణలోని 440 మండలాల్లో వాతావరణం పొడిగా ఉందని అధికారులు తెలిపారు. 



ఇక 10 మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురవగా, పలుచోట్ల చిరు జల్లులు కురిశాయని అధికారులు తెలిపారు.హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని అసెంబ్లీ, బషీర్ బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్నగర్, నారాయణ గూడ, లిబర్టీ, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా పలు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పండుగ నేపథ్యంలో జిల్లాలకు బస్సులు పెద్ద ఎత్తున వెళుతుండడం కూడా ట్రాఫిక్ సమస్యను తెచ్చిపెట్టింది. ఈ మూడు రోజులు ప్రజలు అలర్ట్ గా వుండాలని అధికారులు తెలిపారు..


మరింత సమాచారం తెలుసుకోండి: