ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. వైఎస్ షర్మిలను పార్టీ చీఫ్ గా ప్రకటించిన దగ్గర నుంచి దూకుడుగా ముందుకువెళ్తోంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో అమలు చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో లాగా అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పక్కా హామీలంటూ ఇటీవల విడుదల చేసింది. తాము ఎన్నికల్లో గెలిస్తే ఇవి పక్కాగా అమలు చేస్తామంటూ ఖర్గే కూడా ప్రకటించారు. అంతేకాకుండా.. ఈమధ్య వైజాగ్‌లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరై పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. వైఎస్ షర్మిల ఎప్పటికైనా సీఎం అవుతారని చెప్పిన రేవంత్ రెడ్డి.. తనకు అండగా ఉంటానంటూ ఆయన ప్రకటించారు.అయితే ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా..? అనే సందేహాల మధ్య షర్మిల కూడా తన పదునైన మాటలతో అటు అన్న వైఎస్ ప్రభుత్వాన్ని, ఇటు విపక్ష పార్టీలపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు రెడీ అయింది.


ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. అయితే, షర్మిల పోటీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.మొదట వైఎస్ షర్మిల ఈ పోటీలో ఉండరంటూ ప్రచారం జరిగినప్పటికీ.. ఆ తరువాత పోటీలో ఉంటారంటూ క్లారిటీ వచ్చింది. APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కడప ఎంపీ బరిలో ఉండనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇప్పటికీ.. అధిష్టానం కూడా పలు సూచనలు చేసినట్లు సమాచారం తెలుస్తుంది.. కడప నుంచి పోటీ చేయాలని ఢిల్లీ పెద్దలు షర్మిలను కోరుతున్నట్లు సమాచారం తెలుస్తోంది.వైఎస్ వివేకా చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు.. సునీత.. వైఎస్ షర్మిలకు సపోర్ట్ చేసిన నేపథ్యంలో షర్మిల కడప నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుదని ఢిల్లీ పెద్దలు పేర్కొంటున్నట్లు సమాచారం తెలుస్తుంది.అయితే, షర్మిల అభిప్రాయాన్ని బట్టి పార్టీ అధిష్టానం డిసైడ్ చేయనున్నట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: