ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 15 మంది ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే తప్పు పనులు చేస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేలను అయినా సరే వదిలిపెట్టేది లేదని ఒక నలుగురిని పిలిచి వాళ్ళతో మాట్లాడానని ప్రవర్తన మార్చుకోమని చెప్పానని చంద్రబాబు కామెంట్లు చేశారు.

సభకు హాజరు కానీ 15  మంది  ఎమ్మెల్యేల గురించి చంద్రబాబు నాయుడు విచారించగా కొంతమంది  విదేశాలకు వెళ్లారని మరి కొందరు మాత్రం ఊళ్లలో ఉన్నారని  చంద్రబాబు నాయుడుకు సమాచారం అందింది.  కూటమి ఏడాది పరిపాలన గురించి ప్రజల దగ్గరకు వెళ్లే కార్యక్రమం  ఏదైతే ఉందొ  అలాంటి దాని గురించి అంత  ముఖ్యమైందని చెప్పినా కూడా  పార్టీ కంటే సొంత విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం గురించి చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది.

ఆలయాలకు, ఇతర ప్రదేశాలకు వెళ్లే వాళ్లకు ఈ కార్యక్రమం  గురించి అవగాహన లేదా అనే కామెంట్లు అయితే వ్యక్తమవుతు ఉండటం గమనార్హం.  చంద్రబాబు చేసిన కామెంట్లు సైతం కరెక్ట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.  పార్టీ నేతలు చేసిన    తప్పులు పార్టీకి  తీవ్రస్థాయిలో నష్టం వస్తుందని కామెంట్లు వ్యక్తమవుతు ఉండటం గమనార్హం. ఆ ఎమ్మెల్యేలపై చంద్రబాబు  ఆగ్రహం  వెనుక అసలు కారణాలివేనని తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో సైతం  ఇదే విధంగా వ్యవహరిస్తే పార్టీకి బెనిఫిట్ కలుగుతుందని  కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ అభివృద్ధి కోసం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.  చంద్రబాబు చురకలతో  పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూడాల్సి ఉంది.  ఈ విషయంలో చంద్రబాబు పనితీరును నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: