ఈ మద్య పక్కవారికి ప్రమాదం ఉంటే..నాకేంటీ అని తప్పించుకుని వెక్కిరించే సమాజంలో..ఓ నేత అందరూ గర్వించేలా ప్రవర్తించాడు..పది మందికి సహాయం చేయడం ఎంత ముఖ్యమో తెలియజెప్పాడు. ఎమ్మెల్యే హోదాలో ఉన్న తన తోటి వారు ఆపదలో ఉంటే వారికి అండగా ఉండి స్వయంగా పరిచర్యలు చేయడంతో ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.
వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సునీల్ దత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ముగ్గుర్ని తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆ సమయానికి ఆసుపత్రిలో స్ట్రెచర్లు తక్కువ ఉండటం..అందుబాటులోకి రాకపోవడంతో..తీవ్రంగా గాయపడిన వ్యక్తిని తన తన భుజాలపై మోసుకుని ఎమర్జన్సీ వార్డుకు తీసుకువెళ్ళారు.
ఫరూఖాబాద్లోని నెక్పూర్లో రెండు బైక్లు ఢీ కొన్నాయి. బైక్ పై పయాణిస్తున్న వ్యక్తులకు తీవ్రంగా గాయాలు కావడంతో సమీపంలో ఉన్న ఎమ్మెల్యే సునీల్ దత్ విషయం తెలుసుకొని వెంటనే ప్రమాద స్థలికి వచ్చి గాయపడ్డ వారిని తన వాహనంలో ఆసుపత్రికి తీసుకు వెళ్లాడు.
గాయపడిన వ్యక్తి నడవలేని స్థితిలో ఉండడంతో అతనిని ఆయన వెంటనే తన భుజాలపై మోసుకుని వెళ్ళడం.. డాక్టర్లు బాధితునికి చికిత్స అందించడం జరిగిపోయింది. సమాజంలో అందరు నేతలు ఇలాంటి మంచి మనసు ఉంటే దేశం ఎంతో బాగుపడుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.