ప్రస్తుతం టీమిండియా జట్టులో సీనియర్ ప్లేయర్గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ను జట్టు నుంచి తప్పించే పరిస్థితులు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే కొంతకాలం నుంచి అతను వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఇక వైస్ కెప్టెన్సీ హోదాలో ఉన్న నేపథ్యంలో ఏ ఇతర ఆటగాడికి ఇవ్వనని అవకాశాలు కేఎల్ రాహుల్కు కల్పిస్తూ వచ్చింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. అయినప్పటికీ తనను తాను నిరూపించుకోవడంలో మాత్రం ప్రతి మ్యాచ్ లో కూడా రాహుల్ విఫలం అవుతూ ఉన్నాడు అని చెప్పాలి.


 భారీ అంచనాల మధ్య ఓపెనర్ గా బరిలోకి దిగుతూ తక్కువ పరుగులు మాత్రమే చేసి ఇక వికెట్ కోల్పోతూ ఉన్నాడు. మిగతా బ్యాట్స్మెన్ లు చెలరేగిపోతున్న సమయంలో కూడా కేఎల్ రాహుల్ మాత్రం పరుగులు రాబట్టడానికి ఎంతో తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. చివరికి పరుగులు రాకపోవడంతో ఒత్తిడికి గురై తప్పు చేసి ప్రత్యర్థులకు దొరికిపోతున్నాడు. అయితే ఇక ఇప్పుడు వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న కే ఎల్ రాహుల్ ను జట్టు నుంచి పీకేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించిన బిసిసిఐ యాజమాన్యం ఇక మూడవ టెస్టులో అతన్ని జట్టు నుంచి కూడా పక్కన పెట్టబోతుంది అన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి.



 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై అటు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తొలినాళ్లలో టెస్టుల్లో విఫలం అయ్యాడు. కానీ అతని నైపుణ్యాలను నమ్మి జట్టు వెనకేసుకు రావడం వల్లే ఇక ఇప్పుడు అద్భుతంగా రాణించడం చేస్తున్నాడు. ఇక ఇప్పుడు రోహిత్.. రాహుల్ విషయంలో కూడా అదే చేస్తున్నాడు. ప్రతి ఆటగాడి కెరియర్ లో కూడా పేలవ దశ అనేది ఉంటుంది. కానీ అంతమాత్రాన జట్టు నుంచి తప్పించడం అనేది సరైనది కాదు అంటూ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. రోహిత్ లాగానే రాహుల్కు అవకాశం ఇవ్వాలి అంటూ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: