ఇటీవల కాలంలో ప్రేక్షకులందరికీ కూడా క్రికెటర్ల గురించి ఒక భావన ఉంది. క్రికెటర్లకు ఏంటి బిందాస్ లైఫ్.. ఒక్కసారి ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టారూ అంటే చాలు కోట్ల రూపాయలు సంపాదించవచ్చు లగ్జరీ కార్లలో తిరగవచ్చు లైఫ్ లో సెటిల్ అవ్వవచ్చు అని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రతి క్రికెటర్ విషయంలో మాత్రం ఇలా జరగదు అన్న విషయం చాలామందికి తెలియదు. ఒకరోజులో పగలు రాత్రి ఎలా ఉంటాయో.. ఒక నాణేనికి బొమ్మ బొరుసు అనేవి ఎలా ఉంటాయో అటు క్రికెటర్లు జీవితాల్లో కూడా ఇలాంటి ఘటనలు ఉంటాయి అని చెప్పాలీ.


 క్రికెటర్ల జీవితాల్లో కూడా ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి.  అన్నింటిని తట్టుకొని నిలబడి ధైర్యంగా ముందుకు సాగినప్పుడు మాత్రమే దానిని జీవితం అని అంటూ ఉంటారు. టీమిండియా వెటరన్  ప్లేయర్ నమన్ ఓజా లైఫ్ కూడా అలాంటిదే అని చెప్పాలీ. ఇటీవల రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో భాగంగా సెంచరీ చేసి అదరగొట్టాడు నమన్ ఓజా. శ్రీలంక లెజెండ్స్  తో జరిగిన ఫైనల్ లో 71 బంతుల్లోనే 108 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలీ. ఇక ఇతనికి ఇన్నింగ్స్ చలవతోనే భారత లెజెండ్స్ జట్టు ఎంతో సునాయాసంగా ఫైనల్లో విజయం సాధించింది అని చెప్పాలీ.


 ఇకపోతే ఈ సిరీస్ మొత్తంలో 137 స్ట్రైక్ రేటుతో 266 పరుగులు చేసి ఇండియా లెజెండ్స్ తరఫున ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టోర్నీ మొత్తంలో పది సిక్సర్లు 30 ఫోర్లు ఉండడం గమనార్హం. అయితే సరిగ్గా మూడు నెలల క్రితం నమన్ ఓజా తీవ్రవోడు దుడుకులు ఎదుర్కొన్నాడు. అక్రమాస్తుల ఆరోపణలు రావడంతో అతని తండ్రి నమన్ ఓజా పై చీటింగ్ కేసు ఇతర కేసులు నమోదు  అయ్యాయి. పోలీసులు అతని అరెస్టు చేశారు. దీంతో మనస్థాపంతో బాధపడిన నమన్ ఓజా మూడు నెలల గ్యాప్ లోనే మళ్లీ మైదానంలోకి దిగి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇక ఫైనల్ మ్యాచ్లో సెంచరీ సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ని దక్కించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: