ఇక వాట్సాప్ కి వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చదువు కున్నోడి దగ్గర నుంచి చదువు లేనోడి దగ్గర వరకు ఉపయోగపడే సోషల్ మీడియా సైట్ గా దూసుకుపోతుంది. ఇక స్మార్ట్ ఫోన్ వున్న ప్రతి వారికి కూడా ఖచ్చితంగా వాట్సాప్ అనేది ఉంటుంది.ఉద్యోగాలు చేసేవారికి అయితే ఈరోజుల్లో వాట్సాప్ చాలా ముఖ్యమైన యాప్ గా తయారు అయ్యింది.అన్ని సంస్థలు కూడా తమ ఉద్యోగస్తుల కో ఆర్డినేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లను క్రియేట్ చేస్తున్నాయి.అయితే ఇక ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. అది ఏంటంటే తమ పాలసీలు ఇంకా అలాగే మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు మే నెలలో 19 లక్షల భారత ఖాతాలను బ్యాన్ చేసినట్టు ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ వెల్లడించడం జరిగింది.ఇక ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్‌-2021 నిబంధనల కింద తాజా నివేదికలో వాట్సాప్ ఈ షాకింగ్ వివరాలను తెలిపడం జరిగింది.ఈ ఐటీ నిబంధనలకు అనుగుణంగా మే 1 వ తేదీ నుంచి మే 30 వ తేదీ వరకూ కూడా నూతన నివేదికను వెల్లడించామని ఇంకా అలాగే ఇందులో యూజర్ల ఫిర్యాదులు దానిపై తాము తీసుకున్న చర్యల వివరాలు కూడా పొందుపరిచామని వాట్సాప్ ప్రతినిధి పేర్కొనడం జరిగింది. 


తమ వేదికపై వేధింపులు ఇంకా అలాగే అభ్యంతరకర కంటెంట్‌పై కూడా పలు చర్యలు తీసుకునేందుకు చొరవ తీసుకున్నామని కూడా వారు చెప్పారు.ఇంకా అలాగే తమ వేదికపై యూజర్ల భద్రత కోసం ఏఐతో పాటు ఇతర సాంకేతిక నైపుణ్యాలను కూడా అందిపుచ్చుకుంటున్నామని తెలిపారు. కంపెనీ పాలసీలు ఇంకా అలాగే మార్గదర్శకాలను ఉల్లంఘించిన ఖాతాలను కూడా బ్యాన్ చేశామని చెప్పడం జరిగింది.ఇంకా అలాగే తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే ఖాతాలతో పాటు నిర్ధారణ కాని మెసేజ్‌లను కూడా పలు కాంటాక్ట్‌లకు ఫార్వార్డ్ చేసే యూజర్ల ఖాతాలపైనా వేటు వేశామని కూడా వివరించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: