హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. రోజుకు 20 కి.మీలకుపైగా నడిచేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. ఈ ఉదయం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం పాంనూర్ నుంచే పాదయాత్ర ప్రారంభం కానుంది. నిన్న స్టేషన్ ఘన్ పూర్ లోని పాంనూరుకు వెళ్లిన బండి సంజయ్.. రాత్రి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోనే బస చేశారు.


ఈనెల 27న మధ్యాహ్నం వరకు పాదయాత్ర సాగుతుంది. 27న హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ వద్ద బహిరంగ సభ నిర్వహించి పాదయాత్ర ముగిస్తారు. బండి నిర్ణయంతో పార్టీ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నెలకొంది. పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున యువత సిద్ధమయ్యారు. 27న జరిగే బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తల సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభ ద్వారా బీజేపీ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: