జబర్దస్త్ హైపర్ ఆది వేసే పంచులకోసమే జబర్దస్త్ ను చూసేవాళ్ళు చాల మంది ఉన్నారు. ఆది తనదైన శైలితో స్క్రిప్ట్ ను ముందుకు తీసుకువెళతారు. అయితే ఇప్పటివరకు చేసిన అన్ని స్క్రిప్ట్ లలో ఫెమస్ పర్సనాలిటీ లను ఇమిటేట్ చేసి ఎన్నో వివాదాలకు తెరతీసేవాడు. అయితే కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ పై కూడా ఆది సెటైర్ వేశాడు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతోన్న రాకేశ్ మాస్టర్…తనపైనే పేరడీ చేయడంతో ఆదిపై ఓ లెవల్ లో ఫైరయ్యాడు. అప్పట్లో రాకేష్ మాస్టర్ డాన్స్ మాస్టర్ గా ఉన్నప్పుడు తాను డాన్సర్స్ తో ఎలా ఉండేవాడో ..
ఇప్పుడు ఎలా ఉండేవాడో అనే విషయాన్నీ " చెల్లెమ్మకు పెళ్ళంటా అన్నయ్య కు సంబరమంటా " అనే డైలాగ్ తో కేష్ మాస్టర్ ను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాడు .ఇక ఇలాంటి వాటిపై మస్త్ ఫన్ క్రియేట్ చేసే ఆది దాన్ని ఇటీవల జరిగిన ‘పండగ సార్ పండగ అంతే’ అనే కార్యక్రమంలో సెటైరికల్ గా వాడేశాడు. అయితే ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మొదట్లో అంతగా పట్టించుకోని రాకేష్ మాస్టర్ ఇప్పుడు తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు .నాపైనే కామెడీ చేస్తావా..?..దొరుకుతావురా తుపాకీ.. అప్పుడు నీకు ఉంటుందిరా ఆదీ..అంటూ స్టైయిట్ వార్నింగ్ ఇచ్చాడు.