ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఈరోజు కొత్తగా 98 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 3042కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2135 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 
 
ప్రస్తుతం 845 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఇద్దరు కరోనా భారీన పడి మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 62కు చేరింది. మరోవైపు గడచిన 24 గంటల్లో 43 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం కేసులు నమోదైన ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: