కృష్ణా జిల్లాల్లో కాస్త అదుపులోకి వచ్చాయి అని భావించిన కరోనా కేసులు ఇప్పుడు భారీగా పెరగడం రాష్ట్ర ప్రభుత్వాన్ని కాస్త కలవరపెడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా కృష్ణా జిల్లాలో 26 మంది కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో బందోబస్తు కోసం వచ్చిన ఏపీఎస్పీకి చెందిన 26 మందికి కరోనా వచ్చింది అని అధికారులు పేర్కొన్నారు.

 

విశాఖపట్నం 16వ బెటాలియన్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు 88 మంది వచ్చారు. వారిలో 26 మందికి కరోనా రావడంతో మిగిలిన వారికి కూడా కరోనా పరిక్షలు చేస్తున్నారు. వంట చేసే కుక్ కి కరోనా వచ్చింది. దీనితో వారు అందరిని ఇప్పుడు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొంత మంది ఫలితాలు రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: