
ఇక భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలనే పెద్దదిగా చేసుకుంటూ చివరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. మరోవైపు అక్రమ సంబంధాల నేపథ్యంలో ఇక కట్టుకున్న వారి పట్ల కాల యముడు గా మారిపోతున్నారూ ఎంతోమంది. ఇక్కడ కూడా ఇలాంటిదే జరిగింది. ఇక ఓ భార్య తన పసుపు కుంకాలు తన చేతులతోనే తెంపుకునెందుకు ప్రయత్నించింది ఇక ఏకంగా దారుణంగా బ్లేడు తో భర్త గొంతు కోసింది కానీ భర్త అప్రమత్తం కావడంతో ఇక ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నాడు. వెంటనే గమనించిన స్థానికులు వెంటనే అతని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించడం చేసారు.
హనుమకొండ జిల్లా పామర్రు మండలం పసరగొండ లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మాడిశెట్టి రాజు అర్చనకు గత నెల 25వ తేదీ వివాహం జరిగింది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆ వ్యక్తి తన భర్త రాజు గొంతుకోసాడు. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు 108 ద్వారా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే అర్చన గత కొన్ని రోజుల నుంచి ఎంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు కాగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..