
ఈ సంవత్సరం భారతదేశం తన 74వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. జాతీయ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పధ్ లో ఈ సంవత్సరం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్వదేశీ పరికరాలతో తయారుచేసిన స్వదేశీ ఆయుధాలను మాత్రమే ఎగ్జిబిట్ చేసారు. ఈ విధంగా గణతంత్ర దినోత్సవంలో భారత్ స్వదేశీయంగా తయారు చేయబడిన ఆయుధాలు మాత్రమే ప్రదర్శించబడ్డ తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇందులో భారతదేశంలో తయారు చేయబడ్డ 185 mm ఫీల్డ్ గన్ తో 21 గన్ సెల్యూట్లతో ఖచ్చితత్వం మరియు విశ్వసనీయత కలగలిసిన ఎంపీటీ అర్జున్, నాగ్, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్, ఆకాష్, ఎయిర్ డిఫెన్స్ మిస్సయిల్స్ సహా ఇతర క్షిపణులు భారత సైన్యంలో స్వదేశీ ఆయుధ వ్యవస్థతో సమకూరి ఉన్నాయి.
గతంలో ఎటువంటి నేషనల్ పెరేడ్ లో అయినా భారతదేశం బయట నుండి తీసుకువచ్చిన మిగ్గులను లేదా మిగిలిన ఆయుధాలను ప్రదర్శించేది. అలాగే ఇప్పుడు అయితే అలా చూపించాలంటే రాఫెల్ ను చూపించాలి. కానీ ఇప్పుడు భారతదేశంలో తన స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ పరికరాలతో తయారుచేసిన ఆయుధాలను, యుద్ధ వాహనాలను ప్రపంచం మొత్తానికి ప్రదర్శించి తాము కూడా ఆయుధాల తయారీలో ఎంతో ప్రగతిని సాధించామని ఘనంగా చాటి చెప్పింది భారత్.