వైఎస్సాఆర్ జలకళ పథకం అమలు చేస్తామని చెప్పినా జగన్ హామీని మరిచిపోయారు. రైతుల భూముల్లో బోర్లు తవ్విస్తామని చెప్పినా ముఖ్యమంత్రి జగన్ ఆదిలోనే మాట తప్పారని విమర్శలు చేస్తున్నారు. అయితే రిగ్గు యజమానులకు ప్రైవేటు వ్యక్తులకు బోర్లు తవ్వే కాంట్రాక్టులు అప్పగించారు. బోరుకు విద్యుత్ ప్రభుత్వం కల్పిస్తుందని మాట ఇచ్చిన సర్కారు తర్వాత చేతులెత్తేసింది. దీంతో ఇప్పటి వరకు 3684 బోర్లకే విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 50 కోట్లకు పైగా బిల్లులు నిలిచిపోయాయి. బోరు తవ్వించి మోటార్ తో సహా ఇస్తామని చెప్పినా సర్కారు విఫలమైంది. ప్రకాశం, విస్సన్నపేట, గుంటూరు, పల్నాడు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో బోర్లు వేయించి ఉంటే జీవితాంతం గుర్తించుకునే వారు.


గతంలో ఎంపీగా ఉన్న లగడపాటి రాజగోపాల్ ప్రధానంగా ల్యాంకో అనే సంస్థకు అనుబంధంగా లైట్ అనే స్వచ్ఛంద సంస్థను నడిపించారు. ల్యాంకో కు ఆదాయపు పన్ను మినహాయింపు తో ఈ స్వచ్ఛంద సంస్థ ను నడిపిస్తూ నందిగామ, జగ్గయ్యపేట లాంటి చోట్ల ఎక్కువగా బోర్లు తవ్వించారు. దీంతో ఆయన రెండు సార్లు ఎంపీగా గెలుపొందగలిగారు. ఒకసారి బోరు తవ్వితే నీళ్లు రాని చోట్ల రైతులు, ఆయా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.


అలాంటి సందర్భంలో బోర్లు వేయించడం ద్వారా ఎక్కువ మందికి నీటి సౌకర్యం కల్పించడమే కాకుండా ఎక్కువ రోజులు ప్రజలకు గుర్తుండే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సార్లు మంచి పథకాలను అటకెక్కించడంలో ఆయా ప్రభుత్వాలు చేసినట్లే వైసీపీ అధినేత సీఎం జగన్ చేస్తున్నారు. కానీ అధికారంలోకి రాకముందు ప్రజలకు ఉచితంగా బోర్లు వేయిస్తామని చెప్పినా సీఎం జగన్ ఆ తర్వాత మాట తప్పడం చాలా బాధాకరమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కావాల్సిన  అవసరమున్న పథకాలను గుర్తుంచుకుని చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అలాంటి కార్యక్రమాన్ని అటకెక్కించడం సర్కారుకే చెడ్డపేరు తెస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: