ప్రస్తుతం ప్రపంచదేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడిపోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాణాంతర శరవేగంగా దేశదేశాలు విజృంభించడంతో పాటు లక్షల ప్రాణాలను బలితీసుకుంటోంది. వ్యాక్సిన్ లేకపోవడంతో.. ఈ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టు పడడం లేదు. ఇక కంటికి కనిపించని కరోనా దెబ్బకు అన్నిరంగాలు విలవిలలాడిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. ఈ క్రమంలోనే లక్షలాది మంది ఉపాధి కోల్పోయి.. రోడ్డున పడుతున్నారు.
అయితే ఇలాంటి సమయంలో నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్-NSCL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 220 ఖాళీలున్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ, సీనియర్ ట్రైనీ, డిప్లొమా ట్రైనీ లాంటి పోస్టుల్ని నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ భర్తీ చేస్తోంది. వారి వివరాలు చూస్తే.. మొత్తం కాళీలు 220 ఉండగా అందులో అసిస్టెంట్ (లీగల్) గ్రేడ్ 1- 3 పోస్టులు ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీలో ప్రొడక్షన్- 16, హార్టికల్చర్- 1, మార్కెటింగ్- 7, హెచ్ఆర్- 2, అగ్రికల్చర్ ఇంజనీర్- 4, సివిల్ ఇంజనీర్- 1, క్వాలిటీ కంట్రోల్- 2, మెటీరియల్స్ మేనేజ్మెంట్- 3 ఖాళీలు ఉన్నాయి.
డిప్లొమా ట్రైనీలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్- 4, ఎలక్ట్రికల్- 3 ఖాళీలు ఉన్నాయి. అలాగే ట్రైనీలో అగ్రికల్చర్- 18, మార్కెటింగ్- 17, అగ్రికల్చర్ స్టోర్స్- 6,
పర్చేస్- 2, టెక్నీషియన్- 27, స్టోర్స్ ఇంజనీరింగ్- 9, స్టెనోగ్రాఫర్- 13, క్వాలిటీ కంట్రోల్- 3, డేటా ఎంట్రీ ఆపరేటర్- 3, అకౌంట్స్- 6, ట్రైనీ మేట్- 3 ఖాళీలు ఉన్నాయి. వీటితో పాటు సీనియర్ ట్రైనీలో అగ్రికల్చర్- 29, అగ్రికల్చర్ ప్లాంట్ ప్రొటెక్షన్- 3, హార్టికల్చర్- 1, మార్కెటింగ్- 10, హెచ్ఆర్- 5, లాజిస్టిక్స్- 5,
క్వాలిటీ కంట్రోల్- 1, అకౌంట్స్- 5 ఖాళీలు ఉన్నాయి.
ఇక ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. దరఖాస్తు ప్రారంభం, చివరి తేదీల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్సైట్లో వెల్లడించనుంది. ఇక ఈ నోటిఫికేషన్కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://www.indiaseeds.com/ వెబ్సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.