ఈ నెల 13 నుంచి జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్—1 ఇంటర్వ్యూలు రద్దయ్యాయి. ఈ మేరకు ఏపీపీఎస్సీ అధికారులు ఒక ప్రకటన చేశారు. వెరిఫికేషన్ సమయంలో లోపాల కారణంగా ఈ ఇంటర్వ్యూలను రద్దు చేశామని తెలిపింది. తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీలను ప్రకటిస్తామని, ఈ మేరకు అభ్యర్థులకు సమాచారం అందజేస్తామని పేర్కొన్నారు. మరోసారి అర్హుల జాబితాను పరిశీలించిన తర్వాత ఇంటర్వ్యూలను ఎప్పటి నుంచి నిర్వహించేది చెబుతామని ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ చెప్పారు. సాంకేతిక పరమైన కారణాలతోనే గ్రూప్-1 ఇంటర్వ్యూలను వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.