ఉదయం పరిగడుపున బార్లి జావా త్రాగడం వల్ల ఎన్నో ఎన్నో వ్యాధులను దూరం చేసుకోవొచ్చు .బార్లి జావా తయారు చేసుకోవడం కుడా చాలా సులభమైన పద్దతిలో ఉంటుంది .ఒక పాత్రలో గుప్పెడు బార్లీ గింజలను పోసి అందులో ఒక లీటర్ నీటిని పోయాలి.
పావుగంట పాటు ఆ నీటిని బాగా మరిగించాలి .దీనితో బార్లీ గింజలు మెత్తగా మారుతాయి .వాటిలోని పోషకాలన్నీ ఆ నీటిలోకి వెళ్తాయి .అనంతరం ఆ నీటిని చల్లార్చి దాంట్లో కొద్దిగా నిమ్మరసం లేదా ఒక టీ స్పూన్ తేనెను కలుపుకొని నిత్యం ఉదయాన్నే తాగాలి .దీంతో అనేక అనారోగ్యాలను నయం చేసుకోవొచ్చు .
దీని వలన కలిగే అద్బుతమైన లాభాలు :
1.పైన చెప్పిన జావాను రోజు ఉదయాన్నే పరగడుపున త్రాగితే మనశరీరంలోని వ్యర్దాలన్ని మూత్రం రూపంలో బయటకు పోతాయి .పెద్ద ప్రేగు శుబ్రం అవుతుంది ,దిని వల్ల కోలన్ కాన్సర్ రాకుండా ఉంటుంది .
2.బాగా వేడిచేసినపుడు బార్లీ నీటిని త్రాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది .
3.కడుపులో అసిడిటీ ,మంట ,గ్యాస్ ,మలబద్దకం వంటి సమస్యలు తొలిగిపోతాయి .
4.బార్లీ నీటిలో సహజ సిద్దమైన యాంటి ఇనప్లమేటిరీ గుణాలు ఉంటాయి .ఇవి అన్ని రకాల వాపులను పోగొడతాయి .కీళ్ళ మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తాయి .
5. మధుమేహం ఉన్నవారు బార్లీ నీటిని తీసుకోవడం చాలా మంచిది .ఎందుకంటే బార్లీ లో ఉండే బీటా గ్లుకాగాన్ గ్లూకోస్ గ్రహించడాన్ని ఆలస్యం చేస్తుంది .దాని వల్ల చక్కెర స్థాయిలు పెరగవు .
6.బార్లీ లో పీచు పదార్ధం పుష్కలంగా ఉంటుంది .అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది .
7.ఈ జావా వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది .దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి .బిపి అదుపులో ఉంటుంది
8.కిడ్నీలో రాళ్ళను కరిగించే శక్తి బార్లీ జావా కు ఉంటుంది .ప్రతిరోజు బార్లీ నీటిని త్రాగుతుంటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి .
9.బాలింతలు బార్లీ నీటిని త్రాగితే పాలు బాగా పడుతాయి .జీర్ణశక్తి పెరుగుతుంది .
10.బరువు తగ్గాలి అనుకునేవారికి ఈ జావా చాలా ఉపయోగపడుతుంది .ఇందులో ఉండే పోషకాలు శరీరం మేటాలిజం ను క్రమబద్దికరిస్తుంది .దీంతో బరువు తగ్గుతారు .అయతే బరువు తగ్గాలి అనుకునేవారు ఉదయంతో పాటు సాయంత్రం కుడా త్రాగితే ఇంకా బాగుంటుంది .