అనంత్ అంబానీ ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు. ఆయన కంపెనీలలో ఓ డెరెక్టర్. వంతారా అనే జంతు సంరక్షణ కేంద్రానికి యజమాని. త్వరలో రాధికా మార్చంట్ కు కాబోయే భర్త. ప్రస్తుతం మూడు రోజుల ముందస్తు వేడుకల్లో సందడి చేస్తున్నారు. అలాంటి అనంత్ చూడటానికి భారీగా ఉంటాడు.  గతంలో బరువు తగ్గినా.. అతని అనారోగ్య పరిస్థితుల వల్ల మళ్లీ బరువు పెరిగాడు.


అతడు ఆగర్భ శ్రీమంతుడి కుమారుడు కాబట్టి ఎలా ఉన్నా చల్తానే.. కానీ ఆనంత్ భారీ కాయుడే కావొచ్చు. అతడి మనసు మాత్రం వెన్న. ఇటీవల వంతారా ఏర్పాటుకు ముందు ఎలాంటి పరిస్థితులు తాను ఎదుర్కొన్నాడో చెప్పినప్పుడే దేశం మొత్తం ఫిదా అయిపోయింది. ఇప్పుడు మూడు రోజుల పెళ్లి వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ముఖేవ్ అంబానీని సైతం కన్నీరు పెట్టించాయి.


జామ్ నగర్ లో జరుగుతున్న పెళ్లి వేడుకలకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఇంత సందడిగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అనంత్ అంబానీ మాటలు ఒక్కసారిగా అక్కడున్న వారిని భావోద్వేగానికి గురి చేశాయి. నా కుటుంబం నన్ను చాలా ప్రత్యేకంగా చూసింది. నాకు ప్రత్యేక మైన స్థానం కల్పించింది. నేను ఆగర్భ శ్రీమంతుడి కొడుకునైనా నా జీవితం పూల పాన్పు కాదు. ఎన్నో ఇబ్బందులు పడ్డాను. చిన్నప్పటి నుంచి అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను.


జీవితం మొత్తం నాకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటి సమయంలో నాకు జన్మనిచ్చిన మా అమ్మానాన్న నాకు అండగా ఉన్నారు. నేను ఇబ్బంది పడకుండా ఏమేం కావాలో అన్నీ సమకూర్చారు. ఇవన్నీ ఇంతలా జరగుతున్నాయి అంటే దానికి కారణం మా అమ్మే. ఆమె గత కొద్ది రోజులుగా రోజుకి 18 గంటలు పనిచేస్తుంది. ఇవన్నీ చేసినందుకు అమ్మా నీకు థ్యాంక్స్ అంటూ వ్యాఖ్యానించారు. అనంత్ మాట్లాడుతున్నంత సేపు ముకేశ్ భావోద్వేగానికి గురయ్యారు. డబ్బున్నంత మాత్రాన కష్టాలు ఉండవని అందరూ అనుకుంటారని.. కానీ దానికి అనంత్ జీవితమే ఒక ఉదాహరణ అని పలువురు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: