అలా ఎలా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హెబ్భా పటేల్ సుకుమార్ నిర్మాతగా చేసిన కుమారి 21ఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో అమ్మడు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తన హాట్ షోతో సినిమా వసూళ్ల పంట పండించింది హెబ్భా పటేల్. అయితే కుమారి 21ఎఫ్ తో ఒక మంచి లిఫ్ట్ రావడంతో ఆ తర్వాత అదే ట్రాక్ కొనసాగిస్తుందని అనుకున్నారు. కాని హెబ్భా పటేల్ వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తూ వచ్చింది. సినిమాలైతే చేసింది కాని అమ్మడు మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేదు.

అంతేకాదు యువ హీరోలతోనే సినిమాలు తీయడం.. అవి కూడా నిరాశపరచడంతో ఓ మోస్తారు కెరియర్ కొనసాగిస్తుంది హెబ్భా పటేల్. ఈ హీరోయిన్ తో సినిమా అంటే యూత్ ఆడియెన్స్ కు పండుగే అనేలా టాక్ తెచ్చుకున్నా సరే అమ్మడు మాత్రం ఆశించిన క్రేజ్ తెచ్చుకోవడంలో వెనకపడ్డది. ఇక అవకాశాలు లేక ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే అమ్మడు చేస్తూ వచ్చింది. ఐటం సాంగ్, కాల్ గాళ్ రోల్ ఇలా ఎలాగోలా ఆడియెన్స్ ముందు రావాలన్న తపన హెబ్భా పటేల్ లో కనిపిస్తుంది.

అయితే హెబ్భా పటేల్ సినిమాలే కాకుండా ఫోటో షూట్స్ తో కూడా అలరిస్తుంది. సినిమాల్లోనే రెచ్చిపోయే అమ్మడు ఫోటో షూట్స్ తో మరింత క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇక లేటెస్ట్ గా అందాల అప్సరస మాదిరిగా హెబ్భా పటేల్ తన మరోసారి తన గ్లామర్ డోస్ పెంచింది. ఈసారి కొత్తగా క్వీన్ తరహాలో స్కిన్ షో కాకుండా ఓర కళ్లతో మాయ చేస్తుంది అమ్మడు. సరైన ఛాన్స్ రావాలే కాని మళ్లీ తన సత్తా చాటాలని చూస్తుంది హెబ్భా పటేల్. ప్రస్తుతం సంపత్ నంది నిర్మిస్తున్న ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో నటిస్తుంది హెబ్భా పటేల్.        

మరింత సమాచారం తెలుసుకోండి: