ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో కి ఎంతో క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఈ కామెడీ షో లో ఎంట్రీ ఇచ్చిన కమిడియన్స్  రోజురోజుకూ క్రేజ్ సంపాదించుకున్నారూ.  ఇక జబర్దస్త్ కామెడీ షో లోని కొంత మంది కమెడియన్స్ మాత్రం తనకంటూ కొన్ని ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే జబర్దస్త్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కమెడీయన్స్ లో ఆటో రాంప్రసాద్ కూడా ఒకరు. ఇక జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తనదైన శైలిలో కామెడీ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.  అయితే ప్రాక్టీస్ చేసిన స్క్రిప్ట్ లో ఉన్నవి కాకుండా ఇక సొంతంగా అప్పటికప్పుడు ఆటో పంచులు వేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాడు రాంప్రసాద్.



 ఇలా ఆటో పంచులు వేస్తూ ఎంతోమందికి ఎంటర్టైన్మెంట్ పంచటంతో చివరికి అతని పేరు ముందు ఆటో అని వచ్చింది. ప్రస్తుతం ఆటో రాంప్రసాద్ అంటే ఎవరైనా అతని గుర్తుపడతారు. అయితే ఆటో రాంప్రసాద్ ప్రస్తుతం ఈటీవీ లో జరిగే ప్రతి ఈవెంట్ లో కూడా తనదైన శైలిలో కామెడీ పంచుతూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే.  ఆటో రాంప్రసాద్ ఇప్పటివరకు ఏ ఈవెంట్ లో అయినా సరే తన ఆటో పంచులతో ఇతరులకు షాక్ ఇస్తూ ఉంటాడు.  కానీ ఇటీవలే ఒక షోలో మాత్రం  ఆటో రాంప్రసాద్ కే షాక్ ఇచ్చాడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్.



 ప్రస్తుతం ఈ టీవీ లో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం వస్తుంది. అయితే ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించి విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమోలో భాగంగా  తెలుగు చిత్ర పరిశ్రమలో 30 ఇయర్స్  పృథ్వీరాజ్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే పృథ్వీరాజ్ మామ పాత్రలో  అటు ఆటో రాంప్రసాద్ అల్లుడు పాత్ర లో వస్తారు.  ఏంటి మామ నా కోసం కేవలం కార్ డ్రైవర్ని పంపించావు కారు ఎందుకు పంపలేదు అంటే.. నువ్వు కేవలం డ్రైవర్ ని మాత్రమే పంపించమన్నావు కదా అందుకే డ్రైవర్ని పంపించాను కార్ పంపలేదు అని ఆటో పంచ్ వేస్తాడు పృద్వి..  ఆ తర్వాత మీ ఊరు ఎలా ఉంది అంటూ ఆటో రాంప్రసాద్ ని అడుగుతాడు పృద్వి..  ఊరులో పెద్ద ఫ్లైఓవర్ కింద పడిపోయింది అంటూ ఆటో రాంప్రసాద్ చెప్పడంతో ఇక పడిపోకుండా కట్టొచ్చు కదా అని మరో ఆటో పంచ్ వేసి ఆటో రాంప్రసాద్ కి షాక్ ఇస్తాడు పృద్వి.

మరింత సమాచారం తెలుసుకోండి: