స్టార్ హీరోలు నటించిన సినిమాలకు,  స్టార్ దర్శకుడు దర్శకత్వం వహించిన సినిమాలకు మొదటి రోజున అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ లు రావడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం,  అదే కొన్ని సినిమాలకు  విడుదలైన తర్వాత చాలా రోజులకు కూడా మంచి  కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర వస్తూ ఉంటాయి,  అలా సినిమా విడుదల అయిన తర్వాత 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన అయిదు సినిమాల గురించి తెలుసుకుందాం...

బాహుబలి 2 : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క హీరోయిన్ గా తెరకెక్కిన బాహుబలి 2  సినిమా విడుదలైన 14 వ రోజు  రెండు తెలుగు రాష్ట్రాల్లో 3. 80 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

అలా వైకుంఠపురంలో : అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలా వైకుంఠపురం లో మూవీ విడుదలైన 14 వ రోజు 2. 77 కోట్ల షేర్ వసూళ్లను కలెక్ట్ చేసింది.

ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్,  జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలైన 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1. 86 కోట్ల కలెక్షన్ లను సాధించింది.

సరైనోడు : అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడు సినిమా విడుదలైన 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1. 41 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఎఫ్ 2 : అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా విడుదలైన 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.33 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూళ్లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: