తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్, మహేష్ కాంబినేషన్ కోసం అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో గతంలో పోకిరి,బిజినెస్ మేన్ వంటి చిత్రాలు విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ప్రస్తుతం డైరెక్టర్ పూరి జగన్నాథ్ పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ తాజాగా విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్గా పాన్ ఇండియా హీరోగా పేరుపొందుతున్నారు ఇద్దరు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. ఇందులో పోకిరి, బిజినెస్ మేన్ చిత్రాల సీక్వెల్ గురించి మాట్లాడడం జరిగింది వాటి గురించి చూద్దాం.


పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. తన సొంత సంస్థ అయిన వైష్ణో అకాడమీ, ఇందిరా ప్రొడక్షన్ పతాకం పై పోకిరి సినిమాని విడుదల చేసాము. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట కూడా సెన్సేషనల్ హిట్ సాధించడమే కాకుండా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను నెలకొంది. ఇక మహేష్ బాబు పండుగాడుగా కృష్ణ మనోహర్ ఐపీఎస్ గా మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ చేసి ప్రేక్షకులను బాగా అలరించారు. ఇక తర్వాత బిజినెస్ మేన్ సినిమాని కూడా తెరకెక్కించాము.


సినిమా కూడా బాగా మంచి విజయాన్ని అందుకుంది నాకు బిజినెస్ మేన్ సినిమా అని త్వరలోనే హిందీలో రీమిక్స్ చేయాలని ఆలోచనలో ఉన్నాను అలాగే గతంలో పోకిరి, బిజినెస్ మేన్ సినిమా సీక్వెల్స్ ని నేను , మహేశ్ చేద్దామనుకున్నాము.. అయితే అప్పటి పరిస్థితులు ఇద్దరి ని నెక్స్ట్ కమిట్మెంట్ వల్ల అది కుదరలేదు కానీ.. నాకు పండుగాడు, సూర్య భాయ్ రెండు క్యారెక్టర్లు అంటే చాలా ఇష్టమని తెలిపారు. అన్ని కలిసి వస్తే తప్పకుండా ఈ సినిమా సీక్వెల్స్ ని త్వరలోనే ఎక్కిస్తానని తెలిపారు అది కూడా మహేష్ బాబుతోనే చేస్తానని వెల్లడించారు దీంతో మహేష్ అభిమానులు కాస్త ఆనందంగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: