మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజుల క్రితం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించగా ,  ఈ మూవీ లో రామ్ చరణ్ కి జంటగా పూజా హెగ్డే నటించింది. ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించాడు. ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి ,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కూడా నక్సలైట్ పాత్రాలలో నటించారు.  ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు , పాటలు , పోస్టర్ లు అద్భుతమైన రేంజ్ లో ఉండడంతో ప్రేక్షకులు ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.  అలా భారీ అంచనాల నడుమ ,  భారీ ఎత్తున విడుదలైన ఆచార్య మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకో లేక పోయింది.

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకో లేకపోయినా ఆచార్య మూవీ మరి కొన్ని రోజుల్లో బుల్లి తెరపై సందడి చేయబోతోంది. ఈ మూవీ సాటిలైట్ హక్కులను జెమినీ టీవీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఆచార్య మూవీ ని జెమినీ టీవీ లో ప్రసారం కాబోయే తేదీ ని కూడా ఇప్పటికే జెమిని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆచార్య మూవీ ని జెమినీ టీవీ లో అక్టోబర్ 23 వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రసారం చేయనున్నారు. మరి బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయినా ఆచార్య మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టు కుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: