మామూలుగా సినీ ఇండస్ట్రీలో జరిగే అవమానాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అవమానాలు అనేవి ఒక్క సామాన్యులకు మాత్రమే కాదు రాజకీయ నాయకులకు , పెద్ద పెద్ద రంగాలకు చెందిన వారికి సెలబ్రిటీలకు.. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఎదురవుతూ ఉంటాయి. కానీ ఒక హోదాలో ఉన్న వాళ్లకి అవమానాలు ఎదురైతే మాత్రం అస్సలు తట్టుకోలేరు.. పైగా అవి తమ కెరియర్ మీద దెబ్బ కొడతాయని వారు బాధపడుతూ ఉంటారు. ఇప్పటికే చాలామంది రాజకీయ సినీ ప్రముఖులు ఎన్నోసార్లు అవమానాలకు కూడా గురయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక నటి తనను బాగా అవమానించారు అంటూ కొన్ని విషయాలు బయట పెట్టింది.


ఆమె ఎవరో కాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బోల్డ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి లబలా.. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించిన ఈమె మోడల్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  కేవలం తెలుగులోనే కాదు కన్నడ , తమిళ్ సినిమాలలో కూడా నటించి మెప్పించింది. బుల్లితెరలో కూడా ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్న జ్యోతి బిగ్ బాస్ మొదటి సీజన్ లో కూడా పాల్గొన్నది   మొదటిసారి అందం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన జ్యోతి ఆ తర్వాత హంగామా,  ఎవడి గోల వాడిది , పెళ్ళాం ఊరెళితే వంటి సినిమాల ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకుంది.


సినిమాల పరంగానే కాదు డ్రగ్స్ విషయంలో కూడా ఈమె పేరు బాగా వినిపించింది.  ఈమె ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోగా.. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు.  కొన్నేళ్ళకు భర్తతో విభేదాలు రావడంతో విడాకులు ఇచ్చి కొడుకుతో ఒంటరిగా జీవితాన్ని గడుపుతోంది. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతి అమెరికాలో అవమానం జరిగిందని తెలిపింది.. ఆమె మాట్లాడుతూ .. ఒక షో పరంగా అమెరికాకు వెళ్ళాము .. అక్కడ మాకు హెడ్గా ఏవీఎస్ ఉన్నారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత జ్యోతి కి యాక్టింగ్ రాదు అంటూ.. నన్ను వాళ్ళ  టీంలోకి తీసుకోనని అన్నాడు. దాంతో నేను కూడా  సెట్ కాని దగ్గర దూరంగా ఉండాలని అనుకున్నాను.  అయితే అక్కడ గోపాలకృష్ణ,  మురళీమోహన్లు కూడా టీం లీడర్లుగా ఉన్నారు.
 అయితే అక్కడ గోపాలకృష్ణతో జరిగిన విషయం చెప్పడంతో నువ్వు మా టీంలో ఉండు అని అన్నాడు. కానీ ఆ సమయంలో ఏవీఎస్ అలా అందరి ముందు అనడంతో యాక్టింగ్ రాదు అని అనడం తో  చాలా అవమానంగా ఫీల్ అయ్యానని తెలిపింది జ్యోతి.

మరింత సమాచారం తెలుసుకోండి: