కొన్ని కాంబినేషన్లు చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తాయి. వాటిని చూడటానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఇక అలాంటి వాటిలో మహేశ్‌బాబు - రాజమౌళి ప్రాజెక్టు ఒకటి.అయితే ఈ కాంబోలో ఎప్పుడో సినిమా మొదలు కావాల్సి ఉన్నా... రాజమౌళి 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్‌' వంటి భారీ ప్రాజెక్టుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకు రూట్‌ క్లియర్‌ అయినట్లే.అయితే  ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను రాజమౌళి మొదలుపెట్టారు.ఇదిలావుంటే  మరోవైపు మహేశ్‌బాబు కూడా త్రివిక్రమ్‌ సినిమాను పట్టాలెక్కించారు.

ఇక  ఆ సినిమా పూర్తవ్వగానే... రాజమౌళి ప్రపంచంలోకి అడుగుపెడతారు మహేష్.అయితే  ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన కొన్ని అప్డేట్ వైరల్ గా మారుతున్నాయి.ఇదిలావుంటే ఇక మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రాజమౌళి-మహేశ్ సినిమాలో విలన్గా కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటింనున్నారని ప్రచారం సాగుతోంది. రీసెంట్ గా కార్తిని సంప్రదించారని ఆయన పాత్ర గురించి చెప్పారని తెలిసింది.అయితే  పాత్ర నచ్చడంలో కార్తి కూడా ఒకే చెప్పడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇక  త్వరోలనే దీనిపై క్లారిటీ రానుంది. ఇకపోతే ఈ విషయం బయటకు రావడం వల్ల రాజమౌళి,

మహేశ్ ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ అవుతున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం వేచి ఉండాల్సిందే.ఇక  ఈ సినిమా వరల్డ్ క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాల కంటే భారీ బడ్జెట్‌తో ఒక ఎపిక్ అడ్వంచర్ ఫిలింగా రాజమౌళి చేయబోతున్నారని సమాచారం.అయితే ఇప్పటికే రాజమౌళి మహేశ్ సినిమా ఎలా ఉండబోతుందో తెలిపారు.ఇక  'ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ' అంటూ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా ఇది ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నారు.అయితే  ఈ చిత్రానికి కథను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాశారు.కాగా  కె.ఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.ఇకపోతే  ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: