మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతూ ఉండడం ... ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుపుతుంది.  ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ , అంజలి ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇది ఇలా ఉంటే నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి కూడా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ రామ్ చరణ్ , కియారా లపై న్యూజిలాండ్ లో భారీ ఖర్చుతో ఒక షెడ్యూల్ ను నిర్వహించింది. ఈ షెడ్యూల్ లో ఈ మూవీ యూనిట్ హీరో ... హీరోయిన్ లపై ఒక పాటను మరియు మరికొన్ని కీలక సన్నివేశాలను కూడా ఈ చిత్ర బృందం చిత్రీకరించినట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ తాజా షెడ్యూల్ కు సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనున్నట్లు ... ఈ షెడ్యూల్ రెండు రోజుల పాటు జరగనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరగనున్న షెడ్యూల్ లో చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ... శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు సినీ ప్రేమికుల్లో నెలకొని ఉన్నాయి. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ... బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: