ప్రణీత పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆమె అభినయం. ఆమె కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి మన తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రణీత తెలుగులోకి ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు.

ఈ విధంగా మన తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె పలు మూవీస్ లలో నటించిన చెప్పుకునేంతగా ఇదేంటీటీ రాలేదు.ఐతే పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన అత్తారింటికి దారేది మూవీ ద్వారా ఈమెకు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకొని వరుస మూవీస్ లలో నటిస్తున్న టైం లోనే ఈమె తన స్నేహితుడు మరియు ప్రముఖ వ్యాపారవేత్త ఐనా నితిన్ రాజు అనే వ్యక్తిని పెళ్లి  చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.

ఐతే ఆమె వివాహం ఐనా కొన్ని నెలలకే ప్రెగ్నెంట్ అయినటువంటి ప్రణీత గత ఏడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా తరుచు తన ఫోటోలతో పాటు తన కూతురు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు.ఇక తన కుమార్తె కాస్త పెద్దగా కావడంతో ఈమె తిరిగి మూవీస్ లోకి రావడానికి తెగ ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస ఫోటోషూట్లు చేసి అందుకు సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్ తో ఆమె  పంచుకుంటున్నారు. ఇకపోతే లేటెస్ట్ గా ఈమె సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో  ముచ్చటించారు. ఈ క్రమంలోనే తాను ప్రెగ్నెన్సీ సమయంలో ఎదుర్కొన్నటువంటి కొన్ని ప్రోబ్ల్మ్స్ గురించి చెప్పుకొచ్చారు. ప్రెగ్నెన్సీ సమయంలో తాను చాలా శరీర బరువు పెరిగిపోయాయని తన ముక్కు బుగ్గలు బాగా ఉబ్బిపోయాయని తెలిపారు. తన చుట్టాలందరూ తనని చాలా క్యూట్ గా ఉన్నావని చెప్పేవారు. అయితే తనకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉండేదని పాప పుట్టిన తర్వాత డైట్ తీసుకుంటూ వ్యాయామాలు చేస్తూ శరీర బరువు తగ్గానని చెప్పారు. అందుకే తన ప్రెగ్నెన్సీ టైం లో ఎక్కువగా ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయలేదని ప్రణీత అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: