టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమెడియన్ నుండి హీరో అవతారం ఎత్తిన హీరో సునీల్, ప్రస్తుతం ఎటు తేల్చుకోలేని పరిస్థితి. దొరికిన ప్రతి డైరెక్టర్ ని మూవీకి ఒప్పించుకొని, హీరోగా నటించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొత్త హీరోలు సునీల్ తో మూవీలు తీయటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, సునీల్ మాత్రం తన కెరీర్ తో గేమ్స్ ఆడుకోవటానికి ఆసక్తిగా లేడు. ఇక తనకు ఉన్న పరిచయాలు ఆలస్యం అయినప్పటికీ, మంచి సినిమాలను ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించాలనే ఉద్ధేశంలో ఉన్నాడు.


అందులోని భాగంలోనే ఈ మధ్య కాలంలో సునీల్ ఓ క్రేజీ కాంబినేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంతలో ఎమైందో ఏమో తెలియదు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ కి రెడ్ సిగ్నల్ పడింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఈ మధ్య కాలంలో సునీల్ సినిమాలు థియోటర్స్ వద్ద ప్రేక్షకులను అలరించటం లేదు. ఇక సునీల్ చేసిన భీమవరం బుల్లోడు సినిమా వచ్చి సంవత్సరం అయినా, ఇప్పటి వరకూ ఏ ప్రాజెక్ట్ ఓ కొలిక్కి రాలేదు. ఇక కృష్ణాష్టమి సినిమాని పూర్తయిన తరువాత, ప్రస్తుతం వంశీ కృష్ణ ఆకెళ్ళ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.


ఇదిలా ఉంటే, స్టార్ రైటర్ గోపి మోహన్ దర్శకత్వంతో అనిల్ సుంకర నిర్మాతగా ఓ సినిమా ప్లానింగ్ చేశారు. ఇక ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్న సునీల్, తాజాగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోవటంతో నిరాశ పడినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ చిత్రం, షడన్ గా ఆగిపోవటంతో సునీల్ ఇంకా షాకింగ్ లోనే ఉన్నాడంట.


రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గోపి మోహన్ సునీల్ సినిమాపై స్పందిస్తూ ‘సునీల్ గారు కృష్ణాష్టమి సినిమా కోసం చాలా ఎక్కువ సమయం తీసేసుకున్నారు. దాంతో ఆ సినిమాని పక్కన పెట్టేసాను. ప్రస్తుతం కొత్త వారితో సినిమా చేయడానికి కథని సిద్దం చేసుకుంటున్నాను. డైరెక్టర్ గా నా మొదటి సినిమా అదే అవుతుందని’ గోపి మోహన్ తెలిపాడు. సునీల్ పై గోపిమోహన్ ఇలా కామెంట్ చేయటం పై సునీల్ షాక్ అయినట్టుగా తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: