మెగాహీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విన్నర్ నేడు థియోటర్స్ ని హిట్ చేసింది. మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీపై సాయి ధరమ్ తేజ్ కి భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఫ్యాన్స్ సైతం సాయి ధరమ్ తేజ్ మూవీపై గట్టి నమ్మకమే పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ విన్నర్ మూవీకి థియోటర్స్ వద్ద టాక్స్ పాజిటివ్ గానే వస్తున్నట్టు తెలుస్తుంది.


ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు పాజిటివ్ గా రావటంతో విన్నర్ మూవీ నెగిటివ్ టాక్ కి కొంచెం దూరంగా ఉందని అంటున్నారు. ఇక కథలో ప్రత్యేకత ఏమీ లేకపోయినప్పటికీ….తన ఎనర్జీతో సాయి ధరమ్ తేజ్ సినిమాని ప్రేక్షకుల మనస్సులోకి వెళ్ళేలా చేశాడని చెప్పవచ్చు. అయితే కొంత మంది మాత్రం విన్నర్ మూవీలో కొన్ని సీన్స్థ చాలా పాతగా ఉందని అంటున్నారు. అయితే ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వివరాలను చూస్తే...గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై ఇండస్ట్రీలో మొదటి నుండి పాజిటివ్ టాక్స్ ఉన్నాయి.


డైరెక్టర్ ఈ చిత్రాన్ని ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా తెరకెక్కించిన విధానం బాగుందని అంటున్నారు. అయితే సామన్య ప్రేక్షకుల పాయింట్ లో చూస్తే….విన్నర్ మూవీని చూసిన ప్రతి ఒక్కరు హ్యాపీ మూడు తో రావటం చూడవచ్చు.  ముఖ్యంగా ఫ్యాన్స్ కి ఈ చిత్రం బాగా నచ్ఛుతుంది. అన్నీ చిత్రాల కమర్షియల్ ఫార్మెట్ గానే ఈ చిత్రం కూడ ఉందని చెప్పవచ్చు. విన్నర్ లో సాయి ధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమాలో అనసూయ ఐటెం సాంగ్ లో మెరిసింది.  అనసూయ సాంగ్ ఈ మూవీకి ప్లస్ గా మారిందని చెప్పవచ్చు.


ఐటెం సాంగ్ వస్తున్నంత సేపు థియోటర్స్ లో ఫ్యాన్స్ చేసే సందడి ఓ రేంజ్ లో ఉంది. విన్నర్ మూవీకి చేసిన ప్రి రిలీజ్ ఫంక్షన్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని కాస్త పెంచేలా ఉందని అంటున్నారు. విన్నర్ ట్రైలర్ ప్రేక్షకులకి నచ్ఛటంతో ఈ సినిమాని అన్ని రకాల ఆడియన్స్ వచ్చి చూసే అవకాశం ఉందని చిత్ర యూనిట్ భావిస్తుంది. ముఖ్యంగా విన్నర్ చిత్రం మాస్ ప్రేక్షకులను విశేషంగా అలరించేలా ఉంది. మల్టీప్లెక్స్ లో మాత్రం ఇది ఎక్కువ కాలం ఉండే చిత్రం కాదని అంటున్నారు. జగపతి బాబు , ముఖేష్ ఋషి , 30 ఇయర్స్ పృథ్వీ వంటి స్టార్ కాస్టింగ్ ఈ చిత్రానికి ప్లస్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: