ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని మీడియాలో వార్తలు ఎలా వస్తున్నాయంటే.. ఎవరైన సెలబ్రిటీలకు ఏదైనా ప్రమాదం జరిగిందంటే.. ఆ వార్తకు మసాలలు జోడించి పలాన అతను సీరియస్ అని. లేదా కాళ్లు చేతులు విరిగాయట.. అని చెత్తను అంతా తెచ్చి ఆ రాతల్లో జొప్పిస్తున్నారు. ఒక రకంగా బాగున్న మనిషిని కూడా చంపేస్తున్నారు. ఇదిగో ఇలాంటి ప్రాబ్లం దర్శకుడు శంకర్ ఇప్పుడు ఎదుర్కొన్నాడు.. అదేమంటే..
తమిళ చిత్రం ఇండియన్ 2 షూటింగ్ సందర్బంగా భారీ క్రేన్ కూలడంతో ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. ఆ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అయితే ఈ ప్రమాదంలో శంకర్కు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి అంటూ గాలి వార్తలు వచ్చాయి. ఆయన కాలు పూర్తిగా విరిగి పోయిందని, సీరియస్గా ఉన్నారని కొందరు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో అసలు శంకర్ ఆరోగ్య పరిస్థితి ఏంటీ అంటూ చాల మంది ఆలోచించడం మొదలు పెట్టారు.. ఇలా మీడియాలో వస్తున్న వార్తలతో శంకర్ అభిమానులు చాలా టెన్షన్ పడ్డారు...
ఇకపోతే అందరికి కాస్త ఊరట లభించే విషయం ఏంటంటే. శంకర్ ఆరోగ్యంగానే ఉన్నాడని క్లారిటీ వచ్చింది. చిన్న చిన్న గాయాలకు చికిత్స పూర్తి చేసుకుని హాస్పిటల్ నుండి వచ్చేయడంతో పాటు పోలీసుల ఎంక్వైరీకి కూడా శంకర్ హాజరు అయినట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ప్రమాద ఘటన గురించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అసలు ప్రమాదం ఎలా జరిగింది అని విచారించారట. ఈ విచారణలో భాగంగా.. లైకా ప్రొడక్షన్స్ వారితో పాటు శంకర్ మరియు కమల్ లను కూడా ప్రశ్నిస్తున్నారని వినికిడి.
ఇదిలా ఉండగా ఈ ప్రమాదం కారణంగా ఇండియన్ 2 చిత్రం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.. ఇకపోతే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి హీరో కమల్ కోటి రూపాయలు ప్రకటించగా, లైకా ప్రొడక్ష్స్ వారు ముగ్గురి కుటుంబాలకు 50 లక్షల చొప్పున ఆర్థిక సాయంను ప్రకటించడం జరిగింది. ఇక ఈ ప్రమాదం పై ఇప్పటి వరకు శంకర్ నోరు మెదపలేదట...