సుకుమార్ దర్శకత్వంలో
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప చిత్రం
క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న
సుకుమార్ మొదటి పాటను
క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తామని తెలిపారు. కానీ ఇంతవరకు డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ మరియు ఓ పాటను విడుదల చేసిన చిత్రబృందం వీటి ద్వారా సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడేలా చేసుకుంది.
రష్మిక మందన
హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
తొలిసారి
అల్లు అర్జున్ రగ్ద్ లుక్కులో కనిపిస్తుండగా అది అభిమానులను ఎంతగానో అలరిస్తుంది.
సుకుమార్ సినిమా అంటేనే కథానాయకుడు వెరైటీగా కనిపిస్తూ అందరినీ అలరిస్తాడు ఆ విధంగానే ఈ సినిమాలో
అల్లు అర్జున్ వెరైటీ రోల్ లో కనిపిస్తాడు అని భావిస్తున్నారు ప్రేక్షకులు. ఇకపోతే ఈ
సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం ఈ
సినిమా అనుకున్న తేదీకి వస్తుందా అన్న అనుమానాలను రేకెత్తిస్తుంది. సంవత్సరాలకు సంవత్సరాలు సినిమాలు చేసి
సుకుమార్ ఈ సినిమాను కూడా గత రెండు సంవత్సరాలుగా ఎడతెరిపి లేకుండా చేస్తూనే ఉన్నాడు.
ఈ నేపథ్యంలో ఈ
సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం అభిమానులను కొంత కలవరపెడుతోంది. ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ
సినిమా షూటింగ్ మొదటి భాగం కూడా పూర్తి కాలేదట రెండవ భాగం సంగతి పక్కన పెడితే ఈ విభాగం అయినా అనుకున్న సమయానికి వస్తుందా అని ఆరా తీస్తే అది కూడా కష్టమన తెలుస్తోంది .
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నుంచి ఓ పాట విడుదల కాగా ఇది దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. మరి
సుకుమార్ అనుకున్న తేదీకి ఈ సినిమాను విడుదల చేసి మాట నిలబెట్టుకుంటా లేదా
బన్నీ అభిమానులను మరొకసారి నిరాశ పరుస్తాడా అనేది చూడాలి.