ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణవంశీ  ఎక్కువగా ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీలను తెరకెక్కించి మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు.


రామ్ గోపాల్ వర్మ  శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ వంశీ ఆయన ఆలోచనలకు మాత్రం విరుద్ధంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను తెరకెక్కించి అనతి కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా మారారు.సాధారణంగా కృష్ణవంశీ సినిమాల్లో కొంచెం రొమాన్స్ కూడా ఉంటుందని అందరికి తెలుసు.ఇక ఆయన దర్శకత్వం వహించిన ఖడ్గం సినిమా గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2002లో దేశభక్తి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఖడ్గం సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ , రవితేజ, సోనాలి బింద్రే , సంగీత లాంటి స్టార్ లు ఎంతో మంది నటించారు.


హిందూ  మరియు ముస్లిం ఒకటేనని భారత దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతూ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా నంది అవార్డులను సైతం సొంతం చేసుకుంది. సోనాలి బింద్రే కొద్దిసేపు కనిపించగా సంగీత మాత్రం ఫుల్ రోల్ చేసింది. ఈ సినిమాలో సంగీత తనకు ఇష్టం లేకపోయినా తన తల్లి ఈమెను హీరోయిన్ చేయాలని అనుకుంటుందట.బలవంతంగానే డైరెక్టర్ పక్క లోకి కూడా వెళుతుంది అదే సమయంలో తనను ప్రేమించిన రవితేజ తలుపు తీసి వారిని అలా చూడగానే ఎంతగానో బాధ పడిపోతాడు. నిజం చెప్పాలంటే సినీ ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలను ఎంతో మంది స్టార్ హీరోయిన్లు  సైతం ఎదుర్కొన్నారు. 


హీరోయిన్ల సమస్యలు అందరికీ తెలియాలి అన్న కారణంతోనే డైరెక్టర్ వంశీ ఈ సీన్ పెట్టాడని. అంతేకాదు ఒక సీనియర్ డైరెక్టర్, ఒక స్టార్ డైరెక్టర్ ను టార్గెట్ చేస్తూ కృష్ణవంశీ ఈ సీన్ తెరకెక్కించడం జరిగింది అనే వార్తలు కూడా వినిపించాయని తెలుస్తుంది.అయితే ఇందులోఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ సీన్ తెరకెక్కించడంతో అప్పట్లో చాలా వైరల్ గా మారిందట.ఇదిలా ఉండగా హీరోయిన్ రమ్యకృష్ణ తోఒక డైరెక్టర్ ఇలా అసభ్యకరంగా ప్రవర్తించాడు కాబట్టే ఆ డైరెక్టర్ ని టార్గెట్ చేస్తూ కృష్ణవంశీ ఈ సీన్ క్రియేట్ చేశాడని సమాచారం.అలాగే రమ్యకృష్ణ కూడా ఒకసారి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్గా అవకాశాలు రావాలి అంటే దర్శకనిర్మాతలకు లొంగక తప్పదు అని తన మనసులో మాటను అలాగే తాను అనుభవించిన పరిస్థితులను కూడా చెప్పుకొచ్చింది.అంతే కాదు వారు రమ్మన్న గదికి వెళ్లాల్సిందేనని వారికి లొంగి పోవాల్సిందే అంటూ రమ్యకృష్ణ చేసిన మాటలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: