బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నది యాంకర్ రష్మీ గౌతమ్. చాలాకాలం వరకు ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు యాంకర్ ఇంకా చేస్తూ ఉన్నది. ఇక అంతే కాకుండా ఇప్పుడు తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి సైతం హోస్టుగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో జబర్దస్త్ షో నుంచి యాంకర్ అనసూయ వెళ్లిపోవడంతో ఆషో కి కూడా యాంకర్ రష్మీ నే యాంకర్ గా వ్యవహరిస్తున్నది. ఈ షో కు మొదట కొత్త యాంకర్ వస్తుందని ప్రచారం ఎక్కువగా జరిగింది. ఇక అంతే కాకుండా అందుకు సంబంధించి ఒక ప్రోమో కూడా విడుదల చేసి మరింత హైప్ ని చేశారు. అయితే ఆ కొత్త యాంకర్ ఎవరా అని ఆత్రుతగా ఎదురుచూసిన ప్రేక్షకులకు ఇటీవల ఎపిసోడ్లో యాంకర్ రష్మి అని తేల్చేయడం జరిగింది.


ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ రష్మి ఒక ఎమోషనల్ పోస్టును చేసింది. మళ్లీ జబర్దస్త్ లోకి వచ్చినందుకు తనకు ఘన స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలియజేసింది ఈ సో కోసం నేను ఎప్పుడు నిలబడే ఉంటాను.. ఎప్పుడు నేను చేయాల్సినంతవరకు ఈ షో కోసం ఏదైనా చేస్తూనే ఉంటాను అని తెలియజేసింది. అంతేకాకుండా కొత్త వాళ్లు వచ్చేవరకు నేను ఇక్కడే ఉంటాను నాకు ఎక్కడ ఉన్నా సరే సంతోషంగానే ఉంటుంది అప్పటివరకు నన్ను భరించండి ప్లీజ్ అంటూ బాగోద్వేగా పోస్ట్ చేసింది రష్మీ గౌతమ్.


దీంతో కొంతమంది నేటిజన్స్ అభిమానులు సైతం వెల్కమ్ మేడం మీరు ఎప్పుడు బ్యూటిఫుల్ అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు నేటిజన్స్. ప్రస్తుతం యాంకర్ రష్మీ చేసిన ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ నుంచి ఈ పోస్ట్ ను చేసింది రష్మి. అయితే తాజాగా సినిమాలకు కూడా ఈమె గుడ్ బాయ్ చెప్పినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: